టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో చంద్రబాబుకు లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులోనూ 17ఏ(రాజ్యాంగ బద్ధ పదవులు అనుభవించిన లేదా ఉన్న వారి అరెస్టు విషయంలో గవర్నర్కు చెప్పాలన్న/ అనుమతి తీసుకోవాలన్న నిబంధన) వర్తించేలా ఉందని పేర్కొంది.
ఏపీలో రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చంద్ర బాబు ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. ఇంతలో ఎన్నికలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం స్థానంలో వైసీపీ వచ్చింది. తర్వాత.. రాజధానిపై శీతకన్నేసిం ది. ఇక, వివిధ కార్యక్రమాల్లో అవినీతి జరిగిందంటూ.. వైసీపీ సర్కారు చెబుతూ వచ్చింది. గత ఏడాది ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు విస్తరణ, కుదింపు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ.. మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
అరెస్టు చేయకుండా నారాయణ ఇప్పటికే బెయిల్ తెచ్చుకున్నారు. ఇక, చంద్రబాబును రాజమండ్రి జైల్లో ఉంచినప్పుడు.. ఈ కేసులోనూ ఆయనను అరెస్టు చేయాలని సీఐడీ పోలీసులు భావించారు. కానీ, ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ..ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సుదీర్ఘంగా విచారించిన ఏపీ హైకోర్టు.. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే, విచారణకు సహకరించాలని మాత్రం సూచించింది.
ఇదిలావుంటే.. ఇలా బెయిల్ ఎలా ఇస్తారంటూ..ఏపీ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైనా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎట్టకేలకు తాజాగా ఇచ్చిన తీర్పులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఆయనకు నోటీసులు అయినా.. జారీ చేయాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇతర కేసుల్లో 17 ఏ వర్తిస్తే.. దీనికి కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించింది.
This post was last modified on January 29, 2024 1:03 pm
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…