Political News

బీజేపీలో తెలంగాణా సెంటిమెంటు

బీజేపీ అగ్రనేతల్లో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా నాటుకుపోయినట్లు అర్ధమవుతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని తెలంగాణా నుండే పూరించబోతోంది. జాతీయస్ధాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వీలుగా ఉంటుందని దేశంలోని అన్నీ పార్లమెంటు నియోజకవర్గాలను 143 క్లస్టర్లుగా విభజించింది నాయకత్వం. ఇందులో తెలంగాణాలోని 17 నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. దేశంలోని మొదటి క్లస్టర్ మీటింగ్ పాలమూరు జిల్లాలో ఏర్పాటుచేశారు.

అంటే పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా తెలంగాణాలోనే ప్రారంభిస్తున్నట్లు లెక్క. ఈనెల 28వ తేదీన క్లస్టర్ మీటింగు కోసం వీలుంటే అమిత్ షా 27 రాత్రే హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీవర్గాలు చెప్పాయి. ముందురోజు సాయంత్రానికే హైదరాబాద్ చేరుకుంటే పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జీలతో భేటీ అవ్వచ్చని అనుకున్నారట. అలాగే ప్రచార వ్యూహాలను, ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఎవరు ప్రచారం చేయాలనే షెడ్యూల్ ను కూడా రెడీ చేయచ్చని అనుకున్నారు.

మొదటి మీటింగుకు అమిత్ షా వస్తే తర్వాత మీటింగులకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించారో రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా సేమ్ అదే ప్యాటర్ను అనుసరించబోతున్నారు. 28వ తేదీన అమిత్ షా మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నట్లు కమలనాదులు చెప్పారు. 28వ తేదీన మధ్యాహ్నం మహబూబ్ నగర్ క్లస్టర్ మీటింగులో పాల్గొంటారు.

తర్వాత సాయంత్రం అక్కడి నుండి కరీంనగర్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ క్లస్టర్ మీటింగులో నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత 6.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారు. 8 గంటలవరకు హైదరాబాద్ క్టస్టర్ మీటింగులో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవటంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఎందుకంటే ఏ సర్వేలో చూసినా బీజేపీకి 3 లేదా 4 సీట్లకు మించి రావనే తేలింది. అలాంటిది 8 సీట్లు గెలవటం అంటే మామూలు విషయం కాదు. దాని ప్రకారమే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పదిసీట్లకు తక్కువకాకుండా గెలవాలని, గెలుస్తామని కమలనాదులు పదేపదే ప్రకటనలిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on January 27, 2024 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వింతైన వినతితో అడ్డంగా బుక్కైన టీడీపీ ఎంపీ

అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…

32 minutes ago

బాబుతో పవన్ భేటీ!… ఈ సారి అజెండా ఏమిటో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…

59 minutes ago

ఆకాశం దర్శకుడి చేతికి నాగార్జున 100 ?

శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…

1 hour ago

దిల్ రుబా దెబ్బకు ‘కె ర్యాంప్’ చెకింగ్

ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…

2 hours ago

వైఎస్సార్ పేరు పాయే.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలో కొన‌సాగుతున్న కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం సాయంత్రం…

2 hours ago

కోటంరెడ్డిది ‘మురుగు’ నిరసన…మర్రిది ‘చెత్త’ నిరసన

రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ…

3 hours ago