Political News

ఫ్రీ కరెంట్ భారమెంతో తెలుసా ?

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలులో ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే ఆరు హామీలను అమలులోకి తెస్తామని పార్టీ తరపున రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారంచేశారు. వీళ్ళ ప్రచారమే లేకపోతే కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఏదైనా కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.

మిగిలిన నాలుగు హామీలు ఫ్రీ కరెంట్(గృహజ్యోతి), ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, రెండు లక్షల ఉద్యోగాలు, రుణమాఫి పై కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రీ కరెంటుపై కసరత్తు దాదాపు అయిపోవచ్చిందని సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఉచిత విద్యుత్ వల్ల నెలకు ప్రభుత్వంపై రు. 320 కోట్ల భారం పడుతుందట. నెలకు 200 యూనిట్ల విద్యుత్ లోపు వాడుతున్న ఇంటి కనెక్షన్లు 90 లక్షలున్నట్లు విద్యుత్ శాఖ ప్రభుత్వానికి లెక్కలను అందించింది.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు ఆరు హామీలు అమల్లోకి వచ్చేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ లాభపడాలంటే ఇచ్చిన హామీలను అమలు చేసిందనే నమ్మకాన్ని జనాల్లో నిలుపుకోవాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. హామీలిచ్చి గాలికి వదిలేసిందని జనాలు అనుకుంటే పెద్ద సమస్య అయిపోతోంది. అందుకనే హామీల అములుపై ప్రభుత్వం సీరియస్ గానే దృష్టిపెట్టింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న వినియోగదారుల వివరాలను సామాజికవర్గాల వారీగా విద్యుత్ శాఖ సేకరిస్తోంది.

ప్రభుత్వంలో వచ్చిన సందేహం ఏమిటంటే ఉచిత విద్యుత్ ను అన్నీ వర్గాల వారికి అమలుచేయాలా ? లేకపోతే వాళ్ళ స్ధితిగతుల ఆధారంగా అమలుచేయాలా ? అన్నది. ఇప్పటివరకు సేకరించిన వివరాల్లో ఒకే వ్యక్తిపేరుమీద రెండు మూడు కనెక్షన్లున్నాయట. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఐటి రిటర్న్ సమర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నట్లు తెలిసింది. అందుకనే ఇలాంటి వాళ్ళని ఏరేసే కార్యక్రమం చేపట్టబోతొంది ప్రభుత్వం. ఏదేమైనా తొందరలోనే గృహజ్యోతి పథకం అమల్లోకి రావటం ఖాయం.

This post was last modified on January 26, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

17 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

25 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago