మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలులో ప్రభుత్వం స్పీడు పెంచుతోంది. అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే ఆరు హామీలను అమలులోకి తెస్తామని పార్టీ తరపున రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారంచేశారు. వీళ్ళ ప్రచారమే లేకపోతే కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఏదైనా కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలు ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.
మిగిలిన నాలుగు హామీలు ఫ్రీ కరెంట్(గృహజ్యోతి), ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, రెండు లక్షల ఉద్యోగాలు, రుణమాఫి పై కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రీ కరెంటుపై కసరత్తు దాదాపు అయిపోవచ్చిందని సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఉచిత విద్యుత్ వల్ల నెలకు ప్రభుత్వంపై రు. 320 కోట్ల భారం పడుతుందట. నెలకు 200 యూనిట్ల విద్యుత్ లోపు వాడుతున్న ఇంటి కనెక్షన్లు 90 లక్షలున్నట్లు విద్యుత్ శాఖ ప్రభుత్వానికి లెక్కలను అందించింది.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు ఆరు హామీలు అమల్లోకి వచ్చేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ లాభపడాలంటే ఇచ్చిన హామీలను అమలు చేసిందనే నమ్మకాన్ని జనాల్లో నిలుపుకోవాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. హామీలిచ్చి గాలికి వదిలేసిందని జనాలు అనుకుంటే పెద్ద సమస్య అయిపోతోంది. అందుకనే హామీల అములుపై ప్రభుత్వం సీరియస్ గానే దృష్టిపెట్టింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న వినియోగదారుల వివరాలను సామాజికవర్గాల వారీగా విద్యుత్ శాఖ సేకరిస్తోంది.
ప్రభుత్వంలో వచ్చిన సందేహం ఏమిటంటే ఉచిత విద్యుత్ ను అన్నీ వర్గాల వారికి అమలుచేయాలా ? లేకపోతే వాళ్ళ స్ధితిగతుల ఆధారంగా అమలుచేయాలా ? అన్నది. ఇప్పటివరకు సేకరించిన వివరాల్లో ఒకే వ్యక్తిపేరుమీద రెండు మూడు కనెక్షన్లున్నాయట. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఐటి రిటర్న్ సమర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నట్లు తెలిసింది. అందుకనే ఇలాంటి వాళ్ళని ఏరేసే కార్యక్రమం చేపట్టబోతొంది ప్రభుత్వం. ఏదేమైనా తొందరలోనే గృహజ్యోతి పథకం అమల్లోకి రావటం ఖాయం.
This post was last modified on January 26, 2024 10:58 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…