ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే ఉంది. తొందరలోనే అంటే ఈనెలాఖరులోపు లేదా వచ్చేనెలలో తెలుగుదేశంపార్టీలో చేరటం ఖాయమని పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో నంద్యాల నుండి లోక్ సభకు బైరెడ్డి పోటీచేసే అవకాశముందని అంటున్నారు. ఆయన కూతురు శబరిని కూడా అసెంబ్లీకి పోటీచేయించాలని బైరెడ్డి పట్టుబడుతున్నారట. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటిరాలేదు. కూతురు పోటీచేసే విషయాన్ని పక్కనపెట్టేసినా బైరెడ్డి కుటుంబం టీడీపీలో చేరటం దాదాపు ఖాయమనే అంటున్నారు.
బైరెడ్డి 1994,99లో నందికొట్కూరు నుండి ఎంఎల్ఏగా రెండుసార్లు గెలిచారు. 2004లో ఓడిపోయిన తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగింది. దాంతో నందికొట్కూరు నుండి పాణ్యంకు మారారు. అప్పటినుండి ఒకటిరెండుసార్లు పోటీచేసినా గెలవలేదు. టీడీపీని వదిలేసి రాయలసీమ జలాలంటు సామాజిక ఉద్యమాల్లో కొంతకాలం బిజీ అయిపోయారు. ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఆ తర్వాత బీజేపీ మళ్ళీ టీడీపీలో చేరారు. మధ్యలో వైసీపీలో కూడా చేరటానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదు.
తొందరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయాలన్నది బైరెడ్డి కోరిక. అందుకనే చంద్రబాబునాయుడుతో మంతనాలు అన్నీ అయిపోయాయట. కూతురుకు టికెట్ విషయమే ఇంకా తేలలేదట. నంద్యాలలో తాను పోటీచేయటంతో పాటు నందికొట్కూరు, పాణ్యం అసెంబ్లీల్లో టికెట్లు కూడా తనవాళ్ళకే ఇవ్వాలని బైరెడ్డి గట్టిగా పట్టుపడుతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. నందికొట్కూరులో తన మద్దతుదారులతో బైరెడ్డి సమావేశం నిర్వహించారు. తాను టీడీపీ తరపున ఎంపీగా పోటీచేయబోతున్నట్లు చెప్పారట.
ఇపుడు విషయం ఏమిటంటే బైరెడ్డి టీడీపీలో చేరితే ఇప్పటివరకు పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఇన్చార్జిలుగా ఉన్న దంపతులు గౌరు వెంకట్రెడ్డి, గౌరు చరితారెడ్డి పరిస్ధితి ఏమిటన్నది తేలటంలేదు. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే చరితకు ఎంఎల్సీ ఇచ్చేట్లు, మాండ్రను రాజ్యసభకు పంపటానికి చంద్రబాబు హామీ ఇచ్చారట. అందరు తమ్ముళ్ళు కలిసికట్టుగా పనిచేస్తే నంద్యాల ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను గెలుపుఖాయమని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on January 26, 2024 10:26 am
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…