రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి అందని ద్రాక్షపళ్ళు లాగ తయారయ్యాయి. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు కూడా ఒకటి. చివరిసారిగా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది 1999 ఎన్నికల్లోనే. అప్పటినుండి ఇప్పటివరకు అంటే నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతునే ఉంది. 1994-99 మధ్య అప్పటి సీనియర్ నేత లాల్ జాన్ భాష తమ్ముడు జియావుద్దీన్ గెలిచారు. మళ్ళీ ఎంతమంది ప్రయత్నించినా గెలుపు దక్కటంలేదు. మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తరపున ఏ పార్టీ అభ్యర్ధి పోటీచేయబోతున్నారో తెలీటంలేదు.
ఇక్కడ టీడీపీలో పెద్ద మైనస్ ఒకటుంది. అదేమిటంటే ప్రతి ఎన్నికలోను చంద్రబాబునాయుడు ఒక అభ్యర్ధిని పోటీలోకి దింపుతున్నారు. 1999 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఏ జియావుద్దీన్ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మూడు ఎన్నికల్లో నజీర్, మద్దాలిగిరి, మొహ్మద్ నజీర్ పోటీచేశారు. ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపుతుండటం వల్ల పార్టీ బాగా వీకైపోయింది. ద్వితీయ శ్రేణ నేతలతో పాటు క్యాడర్ కు కూడా పెద్ద ఆసక్తి ఉండదు. ఓడిపోయిన వాళ్ళనే మళ్ళీ ఎన్నికల్లో పోటీచేయిస్తే కాస్త సంపతి కూడా తోడవుతుందని చంద్రబాబుకు ఎందుకో అనిపించటంలేదు.
సరే, చరిత్రను వదిలేస్తే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవాలని చంద్రబాబు గట్టిగానే డిసైడ్ అయ్యారని తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీని గెలిపించే గట్టి నేతల కోసం సర్వేలు మొదలుపెట్టారట. గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ముస్తాఫాకు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు.
అందుకనే ఎన్నికల్లో ఆయన కూతురు నూరీ ఫాతిమా పోటీచేయబోతున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున గట్టి మహిళా అభ్యర్ధిని పోటీలోకి దింపితే ఎలాగుంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ పోటీచేస్తుందా లేకపోతే జనసేన చేస్తుందా అనే కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. జనసేన పోటీచేస్తే అభ్యర్ధి ఎవరన్నది అధినేత పవన్ కల్యాణ్ డిసైడ్ చేస్తారు. అదే టీడీపీ పోటీచేస్తే మహిళా అభ్యర్ధిని పోటీలోకి దింపాలని డిసైడ్ అయ్యారని సమాచారం. మరి రాబోయే ఎన్నికల్లో అయినా చంద్రబాబు వ్యూహం వర్కవుటవుతుందా ?
This post was last modified on January 25, 2024 1:02 pm
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…