Political News

జగన్ వ్యాఖ్యల ఆంతర్యమేమి?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 60-70 రోజుల్లోనే ఎన్నికలు ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపోటముల గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండియా టుడే సమ్మింట్లో ఆయన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో బిట్స్ కొన్ని ఇప్పటికే వైరల్ కాగా.. అందులో ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది.

తాను ఇచ్చిన హామీల్లో దాదాపుగా అన్నీ నెరవేర్చానని.. కాబట్టి ఇప్పుడు తాను ఓడిపోయినా చింత లేదని..  తానెంతో సంతోషంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఏపీ సీఎం.

ఈ వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ కామెంట్లతో పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు. కేసీఆర్ గతంలో మాదిరి ఈ ఎన్నికల ముందు కాన్ఫిడెంట్‌గా, అగ్రెసివ్‌గా మాట్లాడలేదు. ఓడితే మీకే నష్టం, నాదేముంది, అన్నీ సాధించా, హాయిగా ఉంటా.. అంటూ ఆయన వైరాగ్యంతో మాట్లాడారు. నెగెటివ్ సెన్స్ వచ్చేలా ఉన్న ఆ వ్యాఖ్యలు చూసి కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని, ఈ విషయం ఆయనకూ అర్థం అయిపోయిందనే చర్చ జరిగింది.

ఇప్పుడు జగన్ ఓడినా బాధ లేదు అనే మాట మాట్లాడడంతో ఆయనకు రియాలిటీ అర్థమయ్యే ఈ మాట మాట్లాడారా అనే  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి మాటలు క్యాడర్‌కు, జనాలకు వేరే సంకేతాలు ఇస్తాయని.. గెలుస్తామన్న ధీమా ఉన్న వాళ్లు ఇలా మాట్లాడరని సోషల్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు.

This post was last modified on January 25, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

2 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

3 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

3 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

4 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

5 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

7 hours ago