ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో సినీ అభిమానులను సంపాయించుకున్న క్యారెక్టర్ నటుడు పృధ్వీ రాజ్.. తాజాగా రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేయ డం తెలిసిందే. అనంతరం.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ చానెల్ చైర్మన్గా కూడా వ్యవహరిం చారు. అయితే.. కొన్ని ఆరోపణలతో ఆయనను పక్కన పెట్టారు. అయితే.. తను చెప్పేది వినకుండానే తనను పక్కన పెట్టారని.. అప్పట్లోనే పృధ్వీ ఆరోపించారు.
ఇక, ఇప్పుడు తాజాగా పృధ్వీ ఓ మీడియాతో మాట్లాడుతూ.. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో 175 కు 175 సీట్లు తెచ్చుకుంటామని చెబుతున్న వైసీపీకి చివరకు మిగిలేది 17 సీట్లేనని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగాప్రచారం చేస్తానని.. తనను ఎవరు ఆపుతారో చూస్తానని అన్నారు.
కాగా, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రెడ్ డైరీ ఉందని చెప్పారన్న పృధ్వీ.. తన దగ్గర పీఆర్ డైరీ ఉందని అన్నారు. దుర్మార్గులు, మోసగాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరిని ఉతికి ఆరేయాలని ప్రజలకు సూచించారు. వీరంతా రాజకీయాలకు అనుర్హలని అన్నారు. వారి చరిత్రనే తన పీఆర్ డైరీలో రాసుకున్నట్టు తెలిపారు. శ్యాంబాబు లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో బయటకు తీస్తానన్నారు.
తాను అవినీతి పరుడిని కాదని పృధ్వీ చెప్పారు. వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో తాను పార్టీకి పనిచేశానని.. 2014, 19లో పార్టీ కోసం ప్రచారం కూడా చేశానని అన్నారు. జగన్ మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మడం తిప్పేశారు. రెడ్డి కాకపోవడమే నా దౌర్భాగ్యం. వైసీపీలో రెడ్లకే పెద్దపీట అని పృధ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on January 24, 2024 1:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…