మరికొద్ది వారాల్లోనే ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండింటిలో ఒకటి తనవైపు మళ్లించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి తమకు అనుకూలంగా మారిన ఎమ్మెల్యేలను వినియోగించుకుని ఒక సీటును ప్రభావం చేసే అవకాశంపై టీడీపీ కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పంచుమర్తి అనురాధను టీడీపీ ఇలానే గెలిపించుకుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన వైసీపీ తాజాగా భారీషాక్ ఇచ్చింది. టీడీపీ టికెట్పై గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గంటా శ్రీనివాసరావుపై తాజాగా అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. ఆయన గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన రాజీనామాను తాజాగా ఆమోదించినట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. నిజానికి 2022, ఫిబ్రవరిలోనే గంటా తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్సారం చేసిన స్పీకర్.. ఇప్పుడు కీలకమైన రాజ్యసభ ఎన్నికల ముందు ఆమోదించడం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.
మరోవైపు.. స్పీకర్ తమ్మినేని సీతారాం మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. టీడీపీ లో గెలిచి.. వైసీపీ బాట పట్టిన ఎమ్మెల్యేలు.. వల్లభనేని వంశీ(గన్నవరం), కరణం బలరాం(చీరాల), వాసుపల్లి గణేష్(విశాఖ దక్షిణ), మద్దాలి గిరి(గుంటూరు వెస్ట్), రాపాక వరప్రసాద్(జనసేన-రాజోలు)లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయి, టీడీపీలో చేరిన మేకపాటి శేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు సైతం నోటీస్ లు జారీ చేశారు. పార్టీ మార్పు పై వారం లోపు సమాధానం చెప్పాలని లేదంటే అనర్హత వేటు వేస్తామని నోటీసులలో స్పష్టం చేశారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…