మరికొద్ది వారాల్లోనే ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ రెండింటిలో ఒకటి తనవైపు మళ్లించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి తమకు అనుకూలంగా మారిన ఎమ్మెల్యేలను వినియోగించుకుని ఒక సీటును ప్రభావం చేసే అవకాశంపై టీడీపీ కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పంచుమర్తి అనురాధను టీడీపీ ఇలానే గెలిపించుకుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన వైసీపీ తాజాగా భారీషాక్ ఇచ్చింది. టీడీపీ టికెట్పై గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గంటా శ్రీనివాసరావుపై తాజాగా అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. ఆయన గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన రాజీనామాను తాజాగా ఆమోదించినట్టు స్పీకర్ కార్యాలయం తెలిపింది. నిజానికి 2022, ఫిబ్రవరిలోనే గంటా తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాత్సారం చేసిన స్పీకర్.. ఇప్పుడు కీలకమైన రాజ్యసభ ఎన్నికల ముందు ఆమోదించడం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.
మరోవైపు.. స్పీకర్ తమ్మినేని సీతారాం మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. టీడీపీ లో గెలిచి.. వైసీపీ బాట పట్టిన ఎమ్మెల్యేలు.. వల్లభనేని వంశీ(గన్నవరం), కరణం బలరాం(చీరాల), వాసుపల్లి గణేష్(విశాఖ దక్షిణ), మద్దాలి గిరి(గుంటూరు వెస్ట్), రాపాక వరప్రసాద్(జనసేన-రాజోలు)లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయి, టీడీపీలో చేరిన మేకపాటి శేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు సైతం నోటీస్ లు జారీ చేశారు. పార్టీ మార్పు పై వారం లోపు సమాధానం చెప్పాలని లేదంటే అనర్హత వేటు వేస్తామని నోటీసులలో స్పష్టం చేశారు.
This post was last modified on January 23, 2024 8:59 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…