Political News

జన్ మత్ జోస్యం నిజమవుతుందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.

అందుకు తగ్గట్లే అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలోను గ్రౌండ్ లెవల్లో సర్వేలు చేయించుకుంటున్నది. బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా సర్వేలపై పూర్తిస్ధాయి దృష్టిపెట్టలేదు. అయితే జన్ మత్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 7-9 స్ధానాలు దక్కుతాయని తేలిందట. అలాగే బీఆర్ఎస్ కు 4 లేదా 5 సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి రెండు లేదా మూడు సీట్లు వచ్చే అవకాశముందని తేలిందట.

హైదరాబాద్ లోక్ సభ సీటును ఏ సర్వే సంస్ధయినా ఎంఐఎంకే వదిలేస్తోంది. అందుకనే మిగిలిన 16 సీట్లలోనే ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే పద్దతిలోనే సర్వేలు నిర్వహిస్తుంది. ఇదే జన్ మత్ సంస్ధ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగానే తన జోస్యాన్ని బయటపెట్టింది. దాని ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పింది. కాంగ్రెస్ కు 65 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ 40 సీట్లలో గెలిచే అవకాశముందని జన్ మత్ ప్రీపోల్ చెప్పింది. ఆ సంస్ధ చెప్పినట్లే ఫలితాలు వచ్చిన విషయం అందరు చూసిందే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్నీ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఓటర్ల ఆలోచన మారే అవకాశముంది. అంతేకాకుండా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయముంది. కాబట్టి ఏ సర్వేసంస్ధ అయినా మళ్ళీ రెండుసార్లు సర్వేలు నిర్వహిస్తాయి. అప్పుడు రాబోయే రిజల్టు ఎలాగుంటుందనేది ఇంకాస్త కీలకంగా మారుతుంది. ఏదేమైనా జన్ మత్ రిడుదలచేసిన ఎగ్జిట్ ఫలితాల సర్వే ఆసక్తిగా మారింది.

This post was last modified on January 23, 2024 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

7 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

5 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago