Political News

జన్ మత్ జోస్యం నిజమవుతుందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది.

అందుకు తగ్గట్లే అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలోను గ్రౌండ్ లెవల్లో సర్వేలు చేయించుకుంటున్నది. బీఆర్ఎస్, బీజేపీలు ఇంకా సర్వేలపై పూర్తిస్ధాయి దృష్టిపెట్టలేదు. అయితే జన్ మత్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 7-9 స్ధానాలు దక్కుతాయని తేలిందట. అలాగే బీఆర్ఎస్ కు 4 లేదా 5 సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి రెండు లేదా మూడు సీట్లు వచ్చే అవకాశముందని తేలిందట.

హైదరాబాద్ లోక్ సభ సీటును ఏ సర్వే సంస్ధయినా ఎంఐఎంకే వదిలేస్తోంది. అందుకనే మిగిలిన 16 సీట్లలోనే ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే పద్దతిలోనే సర్వేలు నిర్వహిస్తుంది. ఇదే జన్ మత్ సంస్ధ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగానే తన జోస్యాన్ని బయటపెట్టింది. దాని ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పింది. కాంగ్రెస్ కు 65 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ 40 సీట్లలో గెలిచే అవకాశముందని జన్ మత్ ప్రీపోల్ చెప్పింది. ఆ సంస్ధ చెప్పినట్లే ఫలితాలు వచ్చిన విషయం అందరు చూసిందే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్నీ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఓటర్ల ఆలోచన మారే అవకాశముంది. అంతేకాకుండా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయముంది. కాబట్టి ఏ సర్వేసంస్ధ అయినా మళ్ళీ రెండుసార్లు సర్వేలు నిర్వహిస్తాయి. అప్పుడు రాబోయే రిజల్టు ఎలాగుంటుందనేది ఇంకాస్త కీలకంగా మారుతుంది. ఏదేమైనా జన్ మత్ రిడుదలచేసిన ఎగ్జిట్ ఫలితాల సర్వే ఆసక్తిగా మారింది.

This post was last modified on January 23, 2024 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

44 minutes ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

1 hour ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

2 hours ago

గుంటూరు మేయర్ రాజీనామా… తర్వాతేంటీ?

ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా…

2 hours ago

పవన్ క్లారిటీతో వివాదం సద్దుమణిగినట్టేనా?

త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…

3 hours ago

అర్జున్ రెడ్డి భామకు బ్రేక్ దొరికిందా

షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్…

3 hours ago