తెలుగుదేశంపార్టీకి సంబంధించి రెండుపేటల్లోను ఇపుడిదే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాలు చాలా కీలకం. చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాగా సీనియర్ నేత. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. 2014-19 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి చరిత్రున్న ప్రత్తిపాటికి రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అంటే పార్టీనేతల్లోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని సమాచారం.
అందుకని చిలకలూరిపేటలో పోటీచేయించటం కన్నా నరసరావుపేటలో పోటీచేయిస్తే ఎలాగుంటుందని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. చిలకలూరిపేట నేతలు ఈమధ్యనే చంద్రబాబును కలిసి ప్రత్తిపాటికి తప్ప ఇంకెవరికైనా టికెట్ ఇవ్వాలని గట్టిగానే చెప్పారట. అందుకనే చంద్రబాబు కూడా టెలిఫోనిక్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. అలాగే నరసరావుపేట నియోజకవర్గంలో కూడా ఇదే పద్దతిలో సర్వే చేయిస్తున్నట్లు పార్టీవర్గాల టాక్ వినిపిస్తోంది.
ప్రత్తిపాటితో నరసరావుపేటలోని అట్లా చిన్నవెంకటరెడ్డి, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఇద్దరిపైనా టెలిఫోనిక్ సర్వే జరుగుతోంది. ఇపుడు నరసరావుపేట ఇన్చార్జిగా చదలవాడ పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అని చదలవాడ చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది సడెన్ గా చంద్రబాబు టెలిఫోనిక్ సర్వే జరిపిస్తుండటంతో చదలవాడలో టెన్షన్ పెరిగిపోతోంది. పై ముగ్గురి నేతల్లో ఎవరిని అభ్యర్ధిగా మద్దతు ఇస్తున్నారనే అంశంపై పార్టీ నేతలతో పాటు వివిధ వర్గాల్లో కూడా సర్వే చేయిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే చిలకలూరిపేటలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రత్తిపాటికి నరసరావుపేట నేతలు, క్యాడర్ మద్దతిస్తారా అన్నది కీలకమైన ప్రశ్న.
వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరిస్తున్నారు. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలను నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. అభ్యర్ధుల విషయంలో జగన్ ధైర్యంగా మార్పులు చేస్తున్నట్లే చంద్రబాబు కూడా చేయగలరా ? అలా చేయగలిగితే ఫలితం సానుకూలంగా ఉంటుందని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. జగన్ అంటే ఏ పార్టీతోను పొత్తులేదు కాబట్టి స్వేచ్చగా ధైర్యంగా చేయగలుగుతున్నారు. కానీ చంద్రబాబు పరిస్ధితి అలాకాదు. జనసేనతో పొత్తు కారణంగా టికెట్ల ఫైనల్ విషయంలో కాస్త అయోమయం తప్పటంలేదు. మరి ప్రత్తిపాటి విషయంలో చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…