“వైసీపీకి ఏళ్ల తరబడి సేవ చేశా. నిజాయితీగా ఉన్నా. అయినా నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీనికి కారణం ఎవరో అందరికీ తెలుసు. అయితే.. నేను పోటీ నుంచి విరమించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా” అని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు రక్షణ నిధి అన్నారు. తాజాగా ప్రకటించిన వైసీపీ నాలుగో జాబితాలో తిరువూరు టికెట్ను పార్టీ ఇటీవల టీడీపీ నుంచి వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్న నల్లగట్ల స్వామిదాసుకు కేటాయించింది.
తిరువూరువైసీపీ సమన్వయ కర్తగా నల్లగట్ల స్వామిదాసును వైసీపీ ప్రకటించింది. దీనిపై తాజాగా రక్షణ నిధి మాట్లాడుతూ.. నియోజకవర్గం ఇంచార్జ్ని మార్చుతున్న క్రమంలో కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పలే దని అన్నారు. పార్టీ కోసం.. తాను అనేక కార్యక్రమాలు చేశానని, పార్టీ ఓడిపోయిన సందర్భంలోనూ తాను గెలిచానని.. కానీ, ఇప్పుడు తనకు అన్యాయం చేశారని అన్నారు. ఎవరో ఎంపీ చెప్పాడని(కేశినేని నాని) తనకు సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగట్ల స్వామిదాసుకు ఎలా సహకరిస్తామని రక్షణ నిధి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాన న్నారు. అయితే.. ఏపార్టీ తరఫున, ఎలా ? అనేది తర్వాత చెబుతానని వ్యాఖ్యానించారు. పోటీ మాత్రం ఖాయమని వెల్లడించారు. ఇదిలావుంటే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రక్షణనిధికి.. గత 2022లోనే మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. అప్పట్లో ఆయనకు పదవి దక్కలేదు.
కానీ, ఇంతలోనే ఆయనను తప్పిస్తూ.. నియోజకవర్గం ఇంచార్జ్ విషయంలో వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు రక్షణనిధికి షాక్కు గురి చేసింది. అయితే.. పార్టీ వర్గాలు మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచన ఉందని.. అందుకే టికెట్ ఇవ్వలేదని అంటున్నాయి. పార్టీ గెలుపునకు కృషి చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆయనకు చెప్పారని, ఆయనకు ప్రాధాన్యం తగ్గించరని చెబుతున్నాయి.
This post was last modified on January 19, 2024 5:20 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…