Political News

చంద్ర‌బాబు.. ‘రామ‌న్న రాజ్యం’ పిలుపు!

తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకున్న టీడీపీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మ‌రో రెండు మాసాల్లో రాష్ట్రంలో రామ‌న్న రాజ్యం ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. రామ‌న్న రాజ్యం ఏర్పాటుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు. నాటి ఎన్టీఆర్.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని.. దీంతో రామ‌న్న రాజ్యం ఏర్ప‌డింద‌ని అన్నారు.

అయితే.. వైసీపీ పాల‌న‌లో పేద‌లు మ‌రింత పేద‌లుగా మారుతున్నార‌ని.. కేవ‌లం వైసీపీ నాయ‌కులు మా త్రమే బ‌ల‌ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ 1983లో పార్టీ స్థాపించిన‌ప్పుడు అన్ని వ‌ర్గాల వారినీ క‌లుపుకొని పోయార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా… కదలిరా!’ అని పిలుపునిచ్చార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలోనే తాము రా..క‌ద‌లిరా! స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

“ఒకే ఒక జీవితం… రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది… తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి’’ అన్నారు.

తెలుగు ప్ర‌జలంతా ఐక్యంగా ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించా రు. వైసీపీ పాల‌న‌ను అంత‌మొందించేందుకు.. అంద‌రూ క‌లిసి ముందుకు రావాల‌ని.. రా..క‌ద‌లిరా! స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని(శుక్ర‌వారం గుడివాడ‌లో ఏర్పాటు చేశారు) చంద్ర‌బాబు కోరారు. ఈ మేరకు ట్విట్ట‌ర్ ఖాతా(ఎక్స్)లో చంద్ర‌బాబు సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు.

This post was last modified on January 18, 2024 1:43 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

45 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago