Political News

రైతుబంధుపై కీలక నిర్ణయం

రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. గురువారం నుండి అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతున్నది. ఇప్పటికే 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుబంధు పథకంలో అర్హతకు 2 ఎకరాలను అర్హతగా మొదటి విడతలో ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ముందు రెండు ఎకరాలను సాగుచేసుకుంటున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేసీయార్ పాలనలో ఏమి జరిగిందంటే రైతుబంధు పథకంలో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా డబ్బులు అందాయి. అసలు సదరు భూస్వాములు వ్యవసాయమే చేయటంలేదు. తమ భూములను కౌలుకు ఇచ్చేసి తాము నగరాల్లోను లేదా విదేశాల్లోను ఉంటున్నారు. ప్రభుత్వం జమచేస్తున్న నిధులన్నీ సదరు భూస్వాముల ఖాతాల్లో జమవుతున్నాయే కాని నిజంగా పొలంలో 24 గంటలూ 365 రోజులు కష్టపడుతున్న కౌలు రైతులకు అందటంలేదు. ఈ విషయంలో కౌలురైతులు, రైతుసంఘాల నుండి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా కేసీయార్ పట్టించుకోలేదు.

కౌలు రైతులను రైతులుగా గుర్తించటానికి కూడా కేసీయార్ ప్రభుత్వం ఇష్టపడలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రైతుబంధు పథకం దుర్వినియోగం కూడా ప్రధాన కారణాల్లో ఒకటి. అందుకనే ఈ పథకం అమలుకు  రేవంత్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. పథకంలో నిజమైన అర్హులను గుర్తించిన తర్వాతే రైతుబంధు నిధులను ఖాతాల్లో జమచేయాలని డిసైడ్ చేసింది. పరిశీలనలో భాగంగా క్షేత్రస్ధాయి నుండి వివరాలు సేకరించింది. అన్నీ వివరాలు గమనించిన తర్వాత ముందుగా రెండెకరాలున్న రైతులను మొదటి విడతలో అర్హులుగా గుర్తించింది.

అందుకనే వీళ్ళ ఖాతాల్లో రైతుబంధు పథకం నిధులను జమచేస్తోంది. రెండో విడత ఆ తర్వాత మూడోవిడత సర్వేలు చేయించుకుని అర్హులైన రైతులను గుర్తించాలన్నది ప్రభుత్వం టార్గెట్. అందుకనే పథకంలో లబ్దిదారులు, అర్హుల జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నది రేవంత్ ఆలోచన. ఈ ప్రక్షాళన సక్రమంగా జరిగితే అప్పుడు రైతుబంధు పథకంలో నిజమైన అర్హులెవరో తేలటంతో పాటు నిధుల వృధాను కూడా అరికట్టినట్లవుతుంది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి. 

This post was last modified on January 18, 2024 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

1 hour ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

4 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

5 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

6 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

7 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

8 hours ago