ఏపీపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి సెంటిమెంటును వాడుకుని పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని నిర్ణయించుకుం ది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకున్న రాజశేఖరరెడ్డి ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. వైఎస్ అభిమానులు, ఆయనను ఆరాధించేవారు.. కాంగ్రెస్కు అండగా నిలవాలన్న పిలుపుని ఇవ్వాలను నిర్ణయించుకుంది.
ఇదేసమయంలో వైఎస్ సానుభూతి ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉంది. దీనిని వైసీపీ నుంచి రాబట్టు కుని తమ వైపు తిప్పుకోవడం ద్వారా.. పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్ని స్తోంది. ఈ రెండు అంశాలనే అజెండాగా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా పార్టీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఇదే సూచనలను పార్టీకి వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేసినట్టు సమాచారం.
ఇక, ఏపీ కాంగ్రెస్ పగ్గాలను త్వరలోనే చేపట్టనున్న వైఎస్ తనయ వైఎస్ షర్మిల టీంలోనూ.. అప్పటి వైఎస్కు అనుకూలంగా ఉన్న వారికి.. ఆయన సెంటిమెంటును తిరిగి పార్టీకి అనుకూలంగామార్చే వారికి చోటు కల్పించనున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్లో ఉండి.. గతంలో పదవులు అనుభవించిన వారు ఎక్కడ ఉన్నా.. తిరిగి పార్టీలో చేర్చుకునేలా కూడా వ్యూహం రెడీ చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమకు అన్నీ తెలుసునని.. కాంగ్రె స్లో ఉన్నప్పుడు పదవులు తీసుకుని, సంపాయించుకున్న వారి జాబితా తమ వద్ద ఉందని.. ఇప్పుడు వారుపార్టీని లైన్లో పెట్టాలని గద్దించారు. దీనిని బట్టి.. పాత కాపులు.. కాంగ్రెస్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వీరికి ఇప్పుడు ప్రధాన అస్త్రాలుగా రాహుల్-వైఎస్ సెంటిమెంట్లే ఆయుధాలుగా మారనున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుతుందో చూడాలి.
This post was last modified on January 15, 2024 7:09 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…