ఏపీపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి సెంటిమెంటును వాడుకుని పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని నిర్ణయించుకుం ది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకున్న రాజశేఖరరెడ్డి ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. వైఎస్ అభిమానులు, ఆయనను ఆరాధించేవారు.. కాంగ్రెస్కు అండగా నిలవాలన్న పిలుపుని ఇవ్వాలను నిర్ణయించుకుంది.
ఇదేసమయంలో వైఎస్ సానుభూతి ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉంది. దీనిని వైసీపీ నుంచి రాబట్టు కుని తమ వైపు తిప్పుకోవడం ద్వారా.. పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్ని స్తోంది. ఈ రెండు అంశాలనే అజెండాగా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా పార్టీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఇదే సూచనలను పార్టీకి వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేసినట్టు సమాచారం.
ఇక, ఏపీ కాంగ్రెస్ పగ్గాలను త్వరలోనే చేపట్టనున్న వైఎస్ తనయ వైఎస్ షర్మిల టీంలోనూ.. అప్పటి వైఎస్కు అనుకూలంగా ఉన్న వారికి.. ఆయన సెంటిమెంటును తిరిగి పార్టీకి అనుకూలంగామార్చే వారికి చోటు కల్పించనున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్లో ఉండి.. గతంలో పదవులు అనుభవించిన వారు ఎక్కడ ఉన్నా.. తిరిగి పార్టీలో చేర్చుకునేలా కూడా వ్యూహం రెడీ చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమకు అన్నీ తెలుసునని.. కాంగ్రె స్లో ఉన్నప్పుడు పదవులు తీసుకుని, సంపాయించుకున్న వారి జాబితా తమ వద్ద ఉందని.. ఇప్పుడు వారుపార్టీని లైన్లో పెట్టాలని గద్దించారు. దీనిని బట్టి.. పాత కాపులు.. కాంగ్రెస్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వీరికి ఇప్పుడు ప్రధాన అస్త్రాలుగా రాహుల్-వైఎస్ సెంటిమెంట్లే ఆయుధాలుగా మారనున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుతుందో చూడాలి.
This post was last modified on January 15, 2024 7:09 pm
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…