ఏపీపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి సెంటిమెంటును వాడుకుని పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని నిర్ణయించుకుం ది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకున్న రాజశేఖరరెడ్డి ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. వైఎస్ అభిమానులు, ఆయనను ఆరాధించేవారు.. కాంగ్రెస్కు అండగా నిలవాలన్న పిలుపుని ఇవ్వాలను నిర్ణయించుకుంది.
ఇదేసమయంలో వైఎస్ సానుభూతి ఇప్పటి వరకు వైసీపీకి అండగా ఉంది. దీనిని వైసీపీ నుంచి రాబట్టు కుని తమ వైపు తిప్పుకోవడం ద్వారా.. పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్ని స్తోంది. ఈ రెండు అంశాలనే అజెండాగా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా పార్టీ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఇదే సూచనలను పార్టీకి వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేసినట్టు సమాచారం.
ఇక, ఏపీ కాంగ్రెస్ పగ్గాలను త్వరలోనే చేపట్టనున్న వైఎస్ తనయ వైఎస్ షర్మిల టీంలోనూ.. అప్పటి వైఎస్కు అనుకూలంగా ఉన్న వారికి.. ఆయన సెంటిమెంటును తిరిగి పార్టీకి అనుకూలంగామార్చే వారికి చోటు కల్పించనున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్లో ఉండి.. గతంలో పదవులు అనుభవించిన వారు ఎక్కడ ఉన్నా.. తిరిగి పార్టీలో చేర్చుకునేలా కూడా వ్యూహం రెడీ చేస్తున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే.
కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమకు అన్నీ తెలుసునని.. కాంగ్రె స్లో ఉన్నప్పుడు పదవులు తీసుకుని, సంపాయించుకున్న వారి జాబితా తమ వద్ద ఉందని.. ఇప్పుడు వారుపార్టీని లైన్లో పెట్టాలని గద్దించారు. దీనిని బట్టి.. పాత కాపులు.. కాంగ్రెస్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. వీరికి ఇప్పుడు ప్రధాన అస్త్రాలుగా రాహుల్-వైఎస్ సెంటిమెంట్లే ఆయుధాలుగా మారనున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుతుందో చూడాలి.
This post was last modified on January 15, 2024 7:09 pm
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…