Political News

ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీడీపీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రాలు ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతోంది. వ్య‌క్తుల ప్ర‌భావం.. పార్టీ ప్ర‌భావం వెర‌సి.. టీడీపీకి కొత్త సంవ‌త్స‌రం.. భారీ ఎత్తున మేలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఈ ద‌ఫా అనంపురంలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నా రు. వైసీపీ త‌ర‌ఫున ఇప్ప‌టికే.. చాలా మందికి సీట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష ను.. పెనుకొండ‌కు మార్చారు. కానీ, ఇక్క‌డ ఆమె గెలుపు కాదు క‌దా.. క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

ఇక‌, పెనుకొండ ఎమ్మెల్యే శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత ఎంపీగా పంపించారు. కానీ, జేసీల దూకుడుకు శంక‌ర‌నారాయ‌ణ బ్రేకులు కూడా వేయ‌లేర‌ని చెబుతున్నారు. అదేవిధంగా హిందూపురంలో ఎవ‌రు వ‌చ్చినా.. బాల‌య్య‌దే గెలుపని నొక్కి చెబుతున్నారు. ప‌య్యావుల కేశ‌వ్ ఉర‌వ‌కొండ‌లో వ‌రుస గెలుపు త‌థ్య‌మ‌ని అంటున్నారు. తాడిప‌త్రి, అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం.. టికెట్లు టీడీపీ ఖాతాలోనే ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

ఇక‌, ఉమ్మ‌డి కృష్ణాలోనూ టీడీపీకిసానుకూల ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మైల‌వ‌రంలో దేవినేని ఉమా గెలుపు త‌థ్య‌మేనని చెబుతున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఈ సారి టీడీపీ ఖాతాలోనే ప‌డుతుంద‌ని.. ఇక్క‌డ బొండా ఉమా  గెలుపు ఇప్ప‌టికే నిర్ణ‌యం అయిపోయిం దని అంటున్నారు. ఏమాత్రం నియోజ‌క‌వ‌ర్గంతో ట‌చ్‌లోలేని వెల్లంప‌ల్లిని ఇక్క‌డ వైసీపీ తీసుకువ‌చ్చింది.  ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ జ‌న‌సేన కొట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, విజ‌య‌వాడతూర్పు.. టీడీపీ ఖాతాలో ప‌డ‌నున్నాయ‌ని అంటున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని ఎఫెక్ట్ ఉన్న గుంటూరు , ప్ర‌కాశం జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపు రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనే నాలుగు స్థానాలు ద‌క్కించుకున్న ప్ర‌కాశంలో ఈ ద‌ఫా.. క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని అంటున్నారు. కీల‌క‌మైన ఈ రెండు జిల్లాల్లో 25 నుంచి 27 స్థానాలు ఈ కూట‌మికి ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల‌ను ముందుగానే రాసిపెట్టుకోవ‌చ్చ‌ని అంటున్నారు. 

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

4 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

5 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

7 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

8 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

10 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

10 hours ago