Political News

ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న టీడీపీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రాలు ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతోంది. వ్య‌క్తుల ప్ర‌భావం.. పార్టీ ప్ర‌భావం వెర‌సి.. టీడీపీకి కొత్త సంవ‌త్స‌రం.. భారీ ఎత్తున మేలు చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఈ ద‌ఫా అనంపురంలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నా రు. వైసీపీ త‌ర‌ఫున ఇప్ప‌టికే.. చాలా మందికి సీట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష ను.. పెనుకొండ‌కు మార్చారు. కానీ, ఇక్క‌డ ఆమె గెలుపు కాదు క‌దా.. క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

ఇక‌, పెనుకొండ ఎమ్మెల్యే శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత ఎంపీగా పంపించారు. కానీ, జేసీల దూకుడుకు శంక‌ర‌నారాయ‌ణ బ్రేకులు కూడా వేయ‌లేర‌ని చెబుతున్నారు. అదేవిధంగా హిందూపురంలో ఎవ‌రు వ‌చ్చినా.. బాల‌య్య‌దే గెలుపని నొక్కి చెబుతున్నారు. ప‌య్యావుల కేశ‌వ్ ఉర‌వ‌కొండ‌లో వ‌రుస గెలుపు త‌థ్య‌మ‌ని అంటున్నారు. తాడిప‌త్రి, అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం.. టికెట్లు టీడీపీ ఖాతాలోనే ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

ఇక‌, ఉమ్మ‌డి కృష్ణాలోనూ టీడీపీకిసానుకూల ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మైల‌వ‌రంలో దేవినేని ఉమా గెలుపు త‌థ్య‌మేనని చెబుతున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఈ సారి టీడీపీ ఖాతాలోనే ప‌డుతుంద‌ని.. ఇక్క‌డ బొండా ఉమా  గెలుపు ఇప్ప‌టికే నిర్ణ‌యం అయిపోయిం దని అంటున్నారు. ఏమాత్రం నియోజ‌క‌వ‌ర్గంతో ట‌చ్‌లోలేని వెల్లంప‌ల్లిని ఇక్క‌డ వైసీపీ తీసుకువ‌చ్చింది.  ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ జ‌న‌సేన కొట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, విజ‌య‌వాడతూర్పు.. టీడీపీ ఖాతాలో ప‌డ‌నున్నాయ‌ని అంటున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని ఎఫెక్ట్ ఉన్న గుంటూరు , ప్ర‌కాశం జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపు రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనే నాలుగు స్థానాలు ద‌క్కించుకున్న ప్ర‌కాశంలో ఈ ద‌ఫా.. క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని అంటున్నారు. కీల‌క‌మైన ఈ రెండు జిల్లాల్లో 25 నుంచి 27 స్థానాలు ఈ కూట‌మికి ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కే నియోజ‌క‌వ‌ర్గాల‌ను ముందుగానే రాసిపెట్టుకోవ‌చ్చ‌ని అంటున్నారు. 

This post was last modified on January 15, 2024 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

5 minutes ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

2 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

7 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

7 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

8 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

8 hours ago