ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కదలికలు మొదలయ్యాయి. ఒకవైపు వైసీపీ, టీడీపీ-జనసేన అధినేతలు పొత్తు చర్చల్లో జోరుపెంచారు. పోటీచేయాల్సిన సీట్లు, నియోజకవర్గాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితరాలపై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి దాదాపు మూడున్నర గంటలు చర్చించారు. ఇక బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికపై జిల్లాల వారీగా కమిటీలను వేసి ఆశావహులతో మీటింగులు పెట్టుకుంటోంది.
వామపక్షాలు తదితర పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వాటి ఉనికి కూడా నామమాత్రం కాబట్టే. నిజానికి కాంగ్రెస్ ఉనికి కూడా నామమాత్రమనే చెప్పాలి. కాకపోతే రెండు కారణాలతో కాంగ్రెస్ కు సడెన్ గా ఊపు మొదలైంది. అదేమిటంటే మొదటిది వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం. ఇక రెండో కారణం ఏమిటంటే వైసీపీ, టీడీపీల్లో జరుగుతున్న పరిణామాలు. టికెట్ల కేటాయంపులో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి మూడు జాబితాలు ప్రకటించారు. ఈ మూడు జాబితాల్లో కలిపి 51 మంది ఎంఎల్ఏలను ప్రకటించారు.
ఇందులోనే 24 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరించారు. వీరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి కొందరు ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామాలు చేశారు. కొలుసు పార్ధసారధి లాంటి మరికొందరు టీడీపీలో చేరిపోయినట్లే. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని వంశీ జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. టికెట్ల కేటాయింపుపై టీడీపీ, జనసేన అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు, పవన్ గనుక టికెట్లను ప్రకటిస్తే ఈ పార్టీల్లో కూడా అసంతృప్తులు బయటపడటం ఖాయం.
వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులపై కాంగ్రెస్ గాలమేస్తోందట. పై రెండు పార్టీల నుండి ఎంతమంది వచ్చినా టికెట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అసలాపార్టీలో గట్టి నేతలే లేరు కాబట్టి. అందుకనే పై రెండుపార్టీల్లోని పరిణామాలను కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. కొడుకు పెళ్ళి పనుల్లో షర్మిల బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం అయిపోతే పార్టీలో షర్మిల యాక్టివ్ అవుతారు. అప్పటికి టికెట్ల విషయంలో పై రెండుపార్టీలు పూర్తి క్లారిటితో ఉంటాయి. కాబట్టి అసంతృప్తుల చేరికలు జోరుగా జరిగే అవకాశాలున్నాయి.
This post was last modified on January 14, 2024 11:40 am
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…