కలివిడిగా.. ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించిన టీడీపీ, జనసేనలు పండుగలను కూడా.. ఉమ్మడి గానే నిర్వహించుకుంటున్నాయి. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని తొలిరోజు నిర్వహించే భోగి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్.. అమరావతి రాజధాని ప్రాంతం మందడంలో నిర్వహించిన భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు.
అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. అందరినీ పేరు పేరునా పలకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు హాజరయ్యారు. ఇక, ఇదే కార్యక్రమానికి మంగళగిరి నుంచి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. భోగి మంటలు అంటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు.. జీవో కాపీలను భోగి మంటల్లో తగులబెట్టారు.
చంద్రబాబు, పవన్.. టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. కాగా మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి. గుంటూరు జిల్లాలోని టీడీపీ ఆఫీస్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో బోగి మంటల వేడుకలు జరిగాయి.
కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి!
‘కీడు తొలగాలి… ఏపీ వెలగాలి’ పేరుతో టీడీపీ నేతలు బోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవో ప్రతులను బోగి మంటల్లో దగ్దం చేశారు. అలాగే వైసీపీ మ్యానిఫెస్టో జిరాక్స్ కాపీలను కూడా పలువరు దహనం చేశారు.
This post was last modified on January 14, 2024 11:38 am
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…