వైసీపీ ప్రజాప్రతినిధులు గత నెల రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండగా.. సీఎం జగన్ మినహా.. గత నెల రోజులుగా మిగిలిన వారు ఎక్కడా కనిపించడం లేదు. మంత్రుల్లోనూ ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాత్రమే కనిపిస్తున్నారు. వారు కూడా కొన్ని అంశాలకే పరిమితమయ్యారు. మిగిలిన వారు ఎక్కడా ఐపు లేకుండా పోయారు.
ఇక, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితే.. అసలు గేటుకు తాళాలు వేసుకున్నారా? అనే పరిస్థితి నెలకొం ది. వారిని కలిసేందుకు వచ్చేవారికి లేరనే సమాధానమే వినిపిస్తోంది. నాయకులు ఊళ్లోనే ఉన్నప్పటికీ.. ఎవరినీ కలుసుకోవడం లేదు. దీనికి కారణం.. టికెట్ ఎఫెక్ట్. ఇప్పుడు వైసీపీలో ఏ నేతను కదిపినా.. టికెట్ ఫీవర్తో అల్లాడిపోతున్నారు. తమకు టికెట్ వస్తుందో రాదో అనే బెంగతో కొందరు ఇంటికే పరిమితం అయ్యారు.
మరికొందరు నాయకులు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విజయవాడ, గుంటూరుల్లోనే రోజుల తరబడి తిష్టవేశారు. కర్నూలు కు చెందిన కీలక మంత్రి గుమ్మనూరు జయరాం.. ఏకంగా వారం రోజుల నుంచి విజయవాడలోని ప్రముఖ హోటల్లోనే ఉన్నారు. ఆయనకు ఇప్పటికీ టికెట్ విషయం తేలలేదు. దీంతో ఏం జరుగుతుందో.. ఏక్షణాన పిలుపు అందుతుందో అని ఎదురు చూస్తున్నారు. హిందూపురం ఎంపీ నుంచి కర్నూలు నాయకుల వరకు ఇదే పరిస్థితి.
దీంతో ఎన్నికలకు మూడుమాసాల సమయం ఉండగానే పాలన దాదాపు ఆగిపోయినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. సహజంగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నిధి నుంచి సాయం పొందేందుకు చాలా మంది మంత్రులను ఆశ్రయిస్తారు. కానీ, ఇప్పుడు వారెవరూ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. ఇక, టికెట్ దక్కని వారు ప్రజాక్షేత్రంలో కనిపించడమే మానేశారు. మరోవైపు.. కొందరు పొరుగు పార్టీల్లో చేరేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదేమైనా .. ఎన్నికలకు మూడు మాసాల ముందుగానే.. ప్రజాప్రతినిధులు ఇలా సుప్తచేతనావస్థకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on January 12, 2024 9:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…