వైసీపీ ప్రజాప్రతినిధులు గత నెల రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండగా.. సీఎం జగన్ మినహా.. గత నెల రోజులుగా మిగిలిన వారు ఎక్కడా కనిపించడం లేదు. మంత్రుల్లోనూ ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాత్రమే కనిపిస్తున్నారు. వారు కూడా కొన్ని అంశాలకే పరిమితమయ్యారు. మిగిలిన వారు ఎక్కడా ఐపు లేకుండా పోయారు.
ఇక, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితే.. అసలు గేటుకు తాళాలు వేసుకున్నారా? అనే పరిస్థితి నెలకొం ది. వారిని కలిసేందుకు వచ్చేవారికి లేరనే సమాధానమే వినిపిస్తోంది. నాయకులు ఊళ్లోనే ఉన్నప్పటికీ.. ఎవరినీ కలుసుకోవడం లేదు. దీనికి కారణం.. టికెట్ ఎఫెక్ట్. ఇప్పుడు వైసీపీలో ఏ నేతను కదిపినా.. టికెట్ ఫీవర్తో అల్లాడిపోతున్నారు. తమకు టికెట్ వస్తుందో రాదో అనే బెంగతో కొందరు ఇంటికే పరిమితం అయ్యారు.
మరికొందరు నాయకులు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విజయవాడ, గుంటూరుల్లోనే రోజుల తరబడి తిష్టవేశారు. కర్నూలు కు చెందిన కీలక మంత్రి గుమ్మనూరు జయరాం.. ఏకంగా వారం రోజుల నుంచి విజయవాడలోని ప్రముఖ హోటల్లోనే ఉన్నారు. ఆయనకు ఇప్పటికీ టికెట్ విషయం తేలలేదు. దీంతో ఏం జరుగుతుందో.. ఏక్షణాన పిలుపు అందుతుందో అని ఎదురు చూస్తున్నారు. హిందూపురం ఎంపీ నుంచి కర్నూలు నాయకుల వరకు ఇదే పరిస్థితి.
దీంతో ఎన్నికలకు మూడుమాసాల సమయం ఉండగానే పాలన దాదాపు ఆగిపోయినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. సహజంగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నిధి నుంచి సాయం పొందేందుకు చాలా మంది మంత్రులను ఆశ్రయిస్తారు. కానీ, ఇప్పుడు వారెవరూ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. ఇక, టికెట్ దక్కని వారు ప్రజాక్షేత్రంలో కనిపించడమే మానేశారు. మరోవైపు.. కొందరు పొరుగు పార్టీల్లో చేరేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదేమైనా .. ఎన్నికలకు మూడు మాసాల ముందుగానే.. ప్రజాప్రతినిధులు ఇలా సుప్తచేతనావస్థకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…