తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అక్షింతలు పంచి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం అయోధ్య లో ఈ నెల 22న బాల రాముని విగ్రహం ప్రతిష్ఠ కానుంది. దీనిని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా అక్కడి అక్షింతలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. దీనిని ప్రస్తావిస్తూ.. కేటీఆర్ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. తాము కూడా యాదాద్రి అక్షింతలు పంపిణీ చేసి ఉంటే గెలిచేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. బీఆర్ ఎస్ సర్క్యులర్ పార్టీ అని.. అన్ని మతాలను సమానంగా చూస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా వచ్చిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్పైనా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్-బీజేపీ బంధానికి రెండునోటిఫికేషన్లు వేర్వేరుగా రావడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ కలవగానే ఎన్నికల పద్ధతి మారిపోయిందని విమర్శించారు. ఈ విషయంపై తాము హైకోర్టుకు వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మరోవైపు.. పొత్తులపైనా కేటీఆర్ స్పందించారు.
తరచుగా కాంగ్రెస్ నేతలు బీఆర్ ఎస్ పార్టీకి .. బీజేపీతో పొత్తు ఉందని చేస్తున్న వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. తాము గతంలోనూ.. ఇప్పుడు.. ఇకపై కూడా బీజేపీనే కాదు.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, పెట్టుకోబోమని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామన్న కేటీఆర్.. ఇక నుంచి ఎమ్మెల్యేల చుట్టూ తాము తిరిగేది లేదన్నారు. ఎమ్మెల్యేలే తమ చుట్టూ తిరిగే వాతావరణం ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యుడినని తెలిపారు. పాలనపై ఎక్కువగా స్పందించి.. పార్టీని విస్మరించామని.. అదే ఓటమికి కారణమైందని కేటీఆర్ చెప్పారు.
ప్రస్తుత ఓటమిని తాము.. కేవలం స్పీడ్ బ్రేకర్ మాదిరిగానే చూస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం కారు షెడ్డుకు వెళ్లలేదని.. కేవలం సర్వీసింగ్కు మాత్రమే వెళ్లిందని చెప్పారు. తాజాగా తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను శాసించే పరిస్థితి ఇకపై ఉండబోదన్నారు. పార్టీ ఓటమికి ప్రజలు కారణం కాదని.. నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేసీఆర్ అన్నీ తెలుసుకుంటున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…