టీడీపీ నాయకుడు, విజయవాడ పార్లమెంటు స్థానం నుంచివచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో ఉన్న కేశినేని శివనాథ్ ఉరఫ్ చిన్నతన సొదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహామహులే టీడీపీని విడిచి పెట్టి వెళ్లిపోయారని..ఈయన ఎంత? అని వ్యాఖ్యానించా రు. తాజాగా నాని.. టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంపీపదవికి కూడా రాజీనామా సమర్పించారు.
ఈ నేపథ్యంలోబుధవారం నాని పార్టీపైనా.. నారా లోకేష్పైనా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. తమ రెండు కుటుంబాల మధ్య 1999 నుంచి కలహాలు ఉన్నాయని.. వాటికి, చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందన్నారు. నాని తనను గతంలో అనేక విధాల ఇబ్బందులు పెట్టారని.. అయినా.. తాను సర్దుకు పోయానని చిన్ని తెలిపారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు.
టీడీపీలో ఉంటూ.. ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన రాజకీయ భిక్షతోనే నాని ఎంపీ అయ్యారని చిన్ని అన్నారు. ఈ విషయాన్ని మరిచిపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీని వీడినా.. పార్టీకి ఏమీ కాలేదన్నారు. పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసిందన్నారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేక పోయారని చిన్ని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 11, 2024 1:07 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…