టీడీపీ నాయకుడు, విజయవాడ పార్లమెంటు స్థానం నుంచివచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో ఉన్న కేశినేని శివనాథ్ ఉరఫ్ చిన్నతన సొదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహామహులే టీడీపీని విడిచి పెట్టి వెళ్లిపోయారని..ఈయన ఎంత? అని వ్యాఖ్యానించా రు. తాజాగా నాని.. టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంపీపదవికి కూడా రాజీనామా సమర్పించారు.
ఈ నేపథ్యంలోబుధవారం నాని పార్టీపైనా.. నారా లోకేష్పైనా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. తమ రెండు కుటుంబాల మధ్య 1999 నుంచి కలహాలు ఉన్నాయని.. వాటికి, చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందన్నారు. నాని తనను గతంలో అనేక విధాల ఇబ్బందులు పెట్టారని.. అయినా.. తాను సర్దుకు పోయానని చిన్ని తెలిపారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు.
టీడీపీలో ఉంటూ.. ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన రాజకీయ భిక్షతోనే నాని ఎంపీ అయ్యారని చిన్ని అన్నారు. ఈ విషయాన్ని మరిచిపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీని వీడినా.. పార్టీకి ఏమీ కాలేదన్నారు. పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసిందన్నారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేక పోయారని చిన్ని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 11, 2024 1:07 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…