Political News

బీజేపీలో కూడా పోటీ పెరుగుతోందా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీలో కూడా పోటీ పెరిగిపోతోంది. వైసీపీ, టీడీపీల్లో సీటుకోసం పోటీ ఉందంటే అర్ధంచేసుకోవచ్చు. ఎందుకంటే రెండూ బలమైన పార్టీలు కాబట్టి సహజంగానే నేతలు ఎక్కువమంది ఉంటారు. కానీ బీజేపీలో కూడా పోటీ ఉందంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీచేయాలని బీజేపీ ఆశిస్తోంది. ఇపుడు పార్టీలోనే ముగ్గురు నేతల మధ్య పోటీ పెరిగిపోతోంది.

చాలాకాలంగా రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విశాఖపట్నం నగరంపై కన్నేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడనుండి పోటీచేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ విశాఖలో ఇంటిని ఏర్పాటుచేసుకున్నారు. వైజాగ్ కేంద్రంగా చాలాకాలంగా పార్టీలో చొచ్చుకుపోతున్నారు. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా జీవీఎల్ విశాఖలోనే చేస్తున్నారు. దీంతో విశాఖ నుండి జీవీఎల్ పోటీచేయబోతున్నారన్న విషయం అర్ధమైపోయింది.

తర్వాత సడెన్ గా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా వైజాగ్ మీద కన్నేశారట. ఈమె కాంగ్రెస్ తరపున రెండోసారి ఇక్కడనుండే గెలిచి కేంద్రమంత్రయ్యారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుండే పోటీచేయాలని పట్టుదలతో ఉన్నారట. అందుకనే ఆమె తరచూ వైజాగ్ లోనే పర్యటిస్తున్నారు. వీళ్ళిద్దరి విషయాన్ని పక్కనపెట్టేస్తే మరో ఎంపీ సీఎం రమేష్ కూడా వైజాగ్ పై కన్నేసినట్లు ప్రచారం మొదలైంది. కడప జిల్లాకు చెందిన రమేష్ వైజాగ్ పై కన్నేయటానికి కారణం ఏమిటంటే ఈ నియోజకవర్గం పరిధిలో వెలమ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉండటమేనట.

నిజానికి వీళ్ళముగ్గురి ఆశలన్నీ టీడీపీపైనే ఉంది. ఎందుకంటే టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుంటుందని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వైజాగ్ నుండి చాలా ఈజీగా గెలవచ్చని పై ముగ్గురు నేతలు ఆశపడుతున్నారు. అందుకనే ఎవరికి వాళ్ళుగా వైజాగ్ సీటుపై కన్నేసినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. మరి వీళ్ళల్లో ఎవరికి ప్రజాబలం ఉందని అడిగితే ఎవరికీ లేదనే చెప్పాలి. అందుకనే టీడీపీ, జనసేన బలంపైన ఆశలుపెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మరి చివరకు ఎవరు పోటీచేస్తారో చూడాలి.

This post was last modified on January 10, 2024 4:54 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

55 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago