Political News

ప్రగతి భవన్ నుండి కంప్యూటర్లు మాయం ?

కేసీయార్ పరిపాలనలో జరిగిన వ్యవహారాలన్నీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ డొల్లతనం, ధరణి పోర్టల్ అక్రమాలు, వివిధ శాఖల వేల కోట్ల రూపాయల రుణాలు, లక్షల కోట్ల అప్పులన్నీ ఇపుడు అంకెలతో సహా బయటపడుతున్నాయి. కేసీయార్ పాలనలో కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు పాల్పడిన భూకబ్జాలు, మోసాలు తదితరాలపై ఫిర్యాదులు వెల్లువుత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తాజాగా నాలుగు కంప్యూటర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన కొందరు ఆపీసుల నుండి కీలకమైన ఫైళ్ళు మాయమైన విషయం తెలిసిందే.

వివిధ శాఖల్లో కొన్ని కీలకమైన ఫైళ్ళు మాయమవ్వగా మరికొన్ని శాఖల్లోని ఫైళ్ళు తగలబడిపోయాయి. ఇపుడు విషయం ఏమిటంటే ప్రగతిభవన్ నుండి నాలుగు కంప్యూటర్లు మాయమైపోయినట్లు తాజాగా బయటపడింది. ప్రగతిభవన్ అంటే కేసీఆర్ అడ్డా. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ప్రగతిభవన్ నుండి నాలుగు కంప్యూటర్లను ఒక వ్యక్తి కారులో తీసుకెళ్ళినట్లు అధికారులు గుర్తించారని సమాచారం.

ఫలితాలు వచ్చిన రోజు అర్ధరాత్రి ప్రగతిభవన్ లోకి ఒక వ్యక్తి కారులో వచ్చారట. భవనంలోకి వెళ్ళి నాలుగు కంప్యూటర్లను తీసుకుని కారులో పెట్టుకుని వెళ్ళినట్లు బయటపడింది. ఇది ఎలాగ బయటపడిందంటే భవనంలోని సీసీ కెమెరాల ఫీడ్ ను చెక్ చేస్తున్నపుడు సడెన్ గా ఈవిషయం బయటపడిందని తెలిసింది. సీసీ కెమెరాలో రికార్డయిన టైం, డేట్ ప్రకారం డిసెంబర్ 3వ తేదీన అర్ధరాత్రి అని తేలింది. కారులో కంప్యూటర్లను తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు ? కారు ఎవరిది అనే విషయాలపై విచారణ మొదలైందట.

కంప్యూటర్లు కేసీయార్ కుటుంబ సభ్యులవా లేకపోతే ప్రభుత్వానివా అన్న విషయంలో క్లారిటి రావటం లేదు. ప్రగతిభవన్లో ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని కంప్యూటర్లు పనిచేశాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వివిధ శాఖలతో సమన్వయం కోసం కొందరు ఉద్యోగులు ప్రగతిభవన్లోనే ఉండి పనిచేశారు. బహుశా వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్లలో కొన్నింటిని గుర్తుతెలీని వ్యక్తి బయటకు తీసుకెళ్ళుండచ్చని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని హార్డ్ డిస్కులు కూడా మాయమయ్యాయని గుర్తించారు. అప్పట్లో ప్రగతిభవన్ సెక్యూరిటి అధికారికి నోటీసులు ఇచ్చి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు జరుగుతన్నాయట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on January 10, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

28 minutes ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

1 hour ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

1 hour ago

జగన్ మారిపోయినట్టేనా

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…

4 hours ago

ఆ మలయాళ హిట్.. మొత్తం హైదరాబాద్‌లో

కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…

12 hours ago

జనవరిలో మాట.. మార్చిలో అచరణ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…

13 hours ago