Political News

అప్ప‌ట్లో వంగ‌వీటి.. ఇప్పుడు యార్ల‌గ‌డ్డ‌.. అంతా బాబు కోసం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోసం.. యాగాలు.. య‌జ్ఞాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుని.. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయాల‌న్న ల‌క్ష్యంతో గ‌న్న‌వ‌రం టీడీపీ ఇంచార్జి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. యాగం త‌ల‌పెట్టారు. దీనిని ఆయ‌న త‌న స‌తీస‌మేతంగా ప్రారంభించారు కూడా. యాగాల‌లో కెల్లా శ్రేష్ట‌మైన‌ది.. కార్యం త‌ల‌పెట్టిన వెంట‌నే సాకారం చేసుకోగ‌లిగిందిగా పేరున్న శ‌త చండీ యాగాన్ని యార్ల‌గ‌డ్డ నిర్వ‌హిస్తున్నారు.

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో యార్ల‌గడ్డ ఈ యాగానికి శ్రీకారం చుట్టారు. 30 మంది వేద పండితులతో(తిరుమ‌ల‌, శ్రీకాళ‌హ‌స్తి, అన్న‌వ‌రం నుంచి వ‌చ్చార‌ట‌) మూడు రోజులు పాటు యాగం జ‌ర‌గ‌నుంద‌ని.. యార్ల‌గ‌డ్డ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేయాల‌న్న కోరిక‌తోనే ఈ యాగానికి శ్రీకారం చుట్టిన‌ట్టు వెంక‌ట్రావు పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీపై దేవుని ఆశీస్సులు కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

మ‌రో మూడు మాసాల్లో అమ‌రావ‌తి వేదిక‌గా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం త‌థ్య‌మ‌ని వెంక‌ట్రావు అన్నారు. అదేవిధంగా గన్నవరం నియోజ‌క‌వ‌ర్గానికి పూర్వవైభ‌వం రావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. ఇదిలావుంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన విజ‌య‌వాడ కు చెందిన కీల‌క నాయ‌కుడు.. వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా కూడా.. చంద్ర‌బాబు విజ‌యం కాంక్షిస్తూ.. శ‌త‌చండీయాగ‌మే నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

వంగ‌వీటి రాధా మాతృమూర్తితో క‌లిసి విజ‌య‌వాడ‌లోని స్వ‌గృహంలో రాధా అప్ప‌ట్లో యాగం చేశారు. కాగా, ఇప్పుడు యాగం చేస్తున్న యార్ల‌గ‌డ్డ కూడా వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన నాయ‌కుడే కావ‌డం విశేషం. మ‌రి రాధా యాగం మాట ఎలా ఉన్నా.. యార్ల‌గ‌డ్డ యాగం ఫ‌లించాల‌ని పార్టీ నాయ‌కులు కోరుకుంటున్నారు. కొన్నిరోజుల కింద‌ట ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలోనూ యాగాలు, య‌జ్ఞాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

This post was last modified on January 8, 2024 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago