టీడీపీ అధినేత చంద్రబాబు కోసం.. యాగాలు.. యజ్ఞాలు తెరమీదికి వస్తున్నాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలన్న లక్ష్యంతో గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు.. యాగం తలపెట్టారు. దీనిని ఆయన తన సతీసమేతంగా ప్రారంభించారు కూడా. యాగాలలో కెల్లా శ్రేష్టమైనది.. కార్యం తలపెట్టిన వెంటనే సాకారం చేసుకోగలిగిందిగా పేరున్న శత చండీ యాగాన్ని యార్లగడ్డ నిర్వహిస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని తన వ్యవసాయ క్షేత్రంలో యార్లగడ్డ ఈ యాగానికి శ్రీకారం చుట్టారు. 30 మంది వేద పండితులతో(తిరుమల, శ్రీకాళహస్తి, అన్నవరం నుంచి వచ్చారట) మూడు రోజులు పాటు యాగం జరగనుందని.. యార్లగడ్డ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలన్న కోరికతోనే ఈ యాగానికి శ్రీకారం చుట్టినట్టు వెంకట్రావు పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీపై దేవుని ఆశీస్సులు కోరుకుంటున్నట్టు చెప్పారు.
మరో మూడు మాసాల్లో అమరావతి వేదికగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని వెంకట్రావు అన్నారు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి పూర్వవైభవం రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. గత 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విజయవాడ కు చెందిన కీలక నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు రాధా కూడా.. చంద్రబాబు విజయం కాంక్షిస్తూ.. శతచండీయాగమే నిర్వహించడం గమనార్హం.
వంగవీటి రాధా మాతృమూర్తితో కలిసి విజయవాడలోని స్వగృహంలో రాధా అప్పట్లో యాగం చేశారు. కాగా, ఇప్పుడు యాగం చేస్తున్న యార్లగడ్డ కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నాయకుడే కావడం విశేషం. మరి రాధా యాగం మాట ఎలా ఉన్నా.. యార్లగడ్డ యాగం ఫలించాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనూ యాగాలు, యజ్ఞాలు జరిగిన విషయం తెలిసిందే.
This post was last modified on January 8, 2024 10:31 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…