టీడీపీ అధినేత చంద్రబాబు కోసం.. యాగాలు.. యజ్ఞాలు తెరమీదికి వస్తున్నాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలన్న లక్ష్యంతో గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు.. యాగం తలపెట్టారు. దీనిని ఆయన తన సతీసమేతంగా ప్రారంభించారు కూడా. యాగాలలో కెల్లా శ్రేష్టమైనది.. కార్యం తలపెట్టిన వెంటనే సాకారం చేసుకోగలిగిందిగా పేరున్న శత చండీ యాగాన్ని యార్లగడ్డ నిర్వహిస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని తన వ్యవసాయ క్షేత్రంలో యార్లగడ్డ ఈ యాగానికి శ్రీకారం చుట్టారు. 30 మంది వేద పండితులతో(తిరుమల, శ్రీకాళహస్తి, అన్నవరం నుంచి వచ్చారట) మూడు రోజులు పాటు యాగం జరగనుందని.. యార్లగడ్డ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలన్న కోరికతోనే ఈ యాగానికి శ్రీకారం చుట్టినట్టు వెంకట్రావు పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీపై దేవుని ఆశీస్సులు కోరుకుంటున్నట్టు చెప్పారు.
మరో మూడు మాసాల్లో అమరావతి వేదికగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని వెంకట్రావు అన్నారు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి పూర్వవైభవం రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. గత 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విజయవాడ కు చెందిన కీలక నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు రాధా కూడా.. చంద్రబాబు విజయం కాంక్షిస్తూ.. శతచండీయాగమే నిర్వహించడం గమనార్హం.
వంగవీటి రాధా మాతృమూర్తితో కలిసి విజయవాడలోని స్వగృహంలో రాధా అప్పట్లో యాగం చేశారు. కాగా, ఇప్పుడు యాగం చేస్తున్న యార్లగడ్డ కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నాయకుడే కావడం విశేషం. మరి రాధా యాగం మాట ఎలా ఉన్నా.. యార్లగడ్డ యాగం ఫలించాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనూ యాగాలు, యజ్ఞాలు జరిగిన విషయం తెలిసిందే.
This post was last modified on January 8, 2024 10:31 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…