టీడీపీ అధినేత చంద్రబాబు కోసం.. యాగాలు.. యజ్ఞాలు తెరమీదికి వస్తున్నాయి. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుని.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలన్న లక్ష్యంతో గన్నవరం టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు.. యాగం తలపెట్టారు. దీనిని ఆయన తన సతీసమేతంగా ప్రారంభించారు కూడా. యాగాలలో కెల్లా శ్రేష్టమైనది.. కార్యం తలపెట్టిన వెంటనే సాకారం చేసుకోగలిగిందిగా పేరున్న శత చండీ యాగాన్ని యార్లగడ్డ నిర్వహిస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని తన వ్యవసాయ క్షేత్రంలో యార్లగడ్డ ఈ యాగానికి శ్రీకారం చుట్టారు. 30 మంది వేద పండితులతో(తిరుమల, శ్రీకాళహస్తి, అన్నవరం నుంచి వచ్చారట) మూడు రోజులు పాటు యాగం జరగనుందని.. యార్లగడ్డ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలన్న కోరికతోనే ఈ యాగానికి శ్రీకారం చుట్టినట్టు వెంకట్రావు పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీపై దేవుని ఆశీస్సులు కోరుకుంటున్నట్టు చెప్పారు.
మరో మూడు మాసాల్లో అమరావతి వేదికగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని వెంకట్రావు అన్నారు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి పూర్వవైభవం రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. గత 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విజయవాడ కు చెందిన కీలక నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు రాధా కూడా.. చంద్రబాబు విజయం కాంక్షిస్తూ.. శతచండీయాగమే నిర్వహించడం గమనార్హం.
వంగవీటి రాధా మాతృమూర్తితో కలిసి విజయవాడలోని స్వగృహంలో రాధా అప్పట్లో యాగం చేశారు. కాగా, ఇప్పుడు యాగం చేస్తున్న యార్లగడ్డ కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నాయకుడే కావడం విశేషం. మరి రాధా యాగం మాట ఎలా ఉన్నా.. యార్లగడ్డ యాగం ఫలించాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. కొన్నిరోజుల కిందట ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనూ యాగాలు, యజ్ఞాలు జరిగిన విషయం తెలిసిందే.
This post was last modified on January 8, 2024 10:31 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…