విజయవాడ ఎంపీ.. కేశినేని నాని కుమార్తె, విజయవాడలోని 11వ వార్డు కార్పొరేటర్ కేశినేని శ్వేత.. తాజాగా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇది ఆమోదం పొందిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతోమాట్లాడుతూ.. టీడీపీ తమను అవమానించిందని అన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినందుకు మాత్రమే తాము టీడీపీకి ధన్యవాదాలు చెబుతున్నామన్న ఆమె.. ఎంపీగా తన తండ్రిని నారా లోకేష్ తీవ్రంగా అవమానించారని వ్యాఖ్యానించారు.
“తిరువూరులో జరిగిన ఘర్షణ విషయంలో నారా లోకేష్ మాట్లాడారు. తిరువూరుతో నీకేం పని అని మా నాన్నను ఆయన ప్రశ్నించారు. నిజానికి తిరువూరు.. మానాన్న పార్లమెంటు పరిధిలో ఉంది. ఆయనకు సంబంధం ఉండదా? ఈ చిన్న విషయం మేం చెప్పాలా? ఇంతకన్నా అవమానం ఏముంటుంది?” అని శ్వేత అన్నారు. ఇక, తమను పార్టీనే వద్దనుకున్నాక.. తాము మాత్రం టీడీపీలో ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.
తమతోపాటు ఎవరు వచ్చినా తీసుకువెళ్లేందుకు సిద్ధమేనని కేశినేని శ్వేత తెలిపారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను విజయవాడకు చెందిన ముగ్గురు టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి కేశినేని నాని ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. తిరువూరులో అసలు ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…