విజయవాడ ఎంపీ.. కేశినేని నాని కుమార్తె, విజయవాడలోని 11వ వార్డు కార్పొరేటర్ కేశినేని శ్వేత.. తాజాగా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇది ఆమోదం పొందిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతోమాట్లాడుతూ.. టీడీపీ తమను అవమానించిందని అన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినందుకు మాత్రమే తాము టీడీపీకి ధన్యవాదాలు చెబుతున్నామన్న ఆమె.. ఎంపీగా తన తండ్రిని నారా లోకేష్ తీవ్రంగా అవమానించారని వ్యాఖ్యానించారు.
“తిరువూరులో జరిగిన ఘర్షణ విషయంలో నారా లోకేష్ మాట్లాడారు. తిరువూరుతో నీకేం పని అని మా నాన్నను ఆయన ప్రశ్నించారు. నిజానికి తిరువూరు.. మానాన్న పార్లమెంటు పరిధిలో ఉంది. ఆయనకు సంబంధం ఉండదా? ఈ చిన్న విషయం మేం చెప్పాలా? ఇంతకన్నా అవమానం ఏముంటుంది?” అని శ్వేత అన్నారు. ఇక, తమను పార్టీనే వద్దనుకున్నాక.. తాము మాత్రం టీడీపీలో ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.
తమతోపాటు ఎవరు వచ్చినా తీసుకువెళ్లేందుకు సిద్ధమేనని కేశినేని శ్వేత తెలిపారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను విజయవాడకు చెందిన ముగ్గురు టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి కేశినేని నాని ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. తిరువూరులో అసలు ఏం జరిగిందో తెలుసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 8, 2024 3:06 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…