ఏపీలో ఎంపీ టికెట్ల విషయంపై తెలంగాణ సీఎం, కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి చెందిన కొందరు అభ్యర్థులు తనను కలుసుకున్నారని, టికెట్లు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో వారికి టికెట్లు ఇవ్వకపోతే.. షర్మిల ద్వారా అయినా.. వారికి టికెట్లు వచ్చేలా చేస్తానని ఆయన చెప్పారు. అయితే, ఆయన ఏ పార్టీ అనేది స్పష్టంగా చెప్పలేదు. ఇక, ఏపీ సీఎం జగన్ తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదన్నారు. రాజకీయంగా ఏపీతో ఉండే సంబంధాలు, విభేదాలు సహజమేనని చెప్పారు. వాటిని కూడా నిబంధనలు, విభజన చట్టం మేరకు ఎలా ఉంటే అలానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ పలు విషయాలపై స్పందించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా రాహుల్ను చూడాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు రాహుల్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. అయితే, ఏపీ సీఎం జగన్.. మాత్రం మరోసారి మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.. తాను మాత్రం రాహుల్ కావాలని భావిస్తున్నానని చెప్పారు. దీనికిగాను తాను ఏం చేయాలో అంతవరకు చేస్తానని చెప్పారు.
అధికారం అండగా లేకుంటే.. కాంగ్రెస్ను ఎదుర్కోలేమని కేసీఆర్ అనుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో బీజేపీని కాదని ప్రతిపక్షాలు మనుగడ సాధించలేకపోతున్నాయన్నారు. సమస్యలు రాకుండా ఉంటాయని బీజేపీతో కేసీఆర్ కలిసిపోవొచ్చునని రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటే పార్లమెంటు స్థానాల్లో గెలవొచ్చని బీజేపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలని చూస్తోందని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీలతో ఓటు అడగాలని అనుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అండగా ఉంటారని అనుకుంటున్నామన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ పరోక్షంగా పొత్తు పెట్టుకుంటాయని, ప్రత్యక్షంగా వాళ్లు పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహారం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గడిచిన నెల రోజులపాటు ఏ రకంగా పాలన చేశామో.. భవిష్యత్లోనూ అలాగే ముందుకెళ్తామని సీఎం రేవంత్ చెప్పారు.
This post was last modified on January 8, 2024 2:50 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…