Political News

జ‌గ‌న్ న‌మ్మ‌క ద్రోహం చేశారు: వైసీపీకి సీనియ‌ర్ నేత రాజీనామా

సీనియ‌ర్ నాయ‌కుడు, రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌.. కాపు రామ‌చంద్రారెడ్డి తాజాగా సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ను జ‌గ‌న్ న‌మ్మించి ద్రోహం చేశార‌ని అన్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌న‌ని చెప్పి.. వంచించార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన కాపును తాజాగా వైసీపీ పక్క‌న పెట్టింది. ఆయ‌న స్థానంలో వేరేవారిని నియ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ నేప‌థ్యంలో కాపు బ్లాస్ట్ అయ్యారు.

సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని కాపు రామ‌చంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు. “రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. క‌నీసం మేం వ‌చ్చామ‌ని చెప్పినా.. ప‌ట్టించుకోలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు. నమ్మించి మా గొంతు కోశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ త‌ర‌ఫున అయినా పోటీకి సిద్దం” అని కాపు నిప్పులు చెరిగారు.

అయితే.. తాను ఏపార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే చెబుతాన‌ని కాపు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌లేద‌న్నారు. “మా ఇంటి నిండా లైట్ లు వేస్తే జగన్ ఫోటో లే కనబడతాయి. వైసీపీ పెట్టినప్పుడు ఐదేళ్లు పదవీకాలం వదులుకొని వచ్చాను. 2014, 2019లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారు. రాత్రి, పగలు గడప గడపకు తిరిగాను అయిన సర్వే పేరుతో టికెట్ నిరాకరించారు. మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి. ఈ రోజు వరకు జగన్ మా దేవుడు అనుకున్నాం. జగన్ మా గొంతు కొస్తాడనుకోలేదు. స్వతంత్రంగా గెలిచే సత్తా కూడా మాకు ఉంది” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on January 5, 2024 10:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

27 mins ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

38 mins ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

3 hours ago