Political News

జ‌గ‌న్ న‌మ్మ‌క ద్రోహం చేశారు: వైసీపీకి సీనియ‌ర్ నేత రాజీనామా

సీనియ‌ర్ నాయ‌కుడు, రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌.. కాపు రామ‌చంద్రారెడ్డి తాజాగా సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ను జ‌గ‌న్ న‌మ్మించి ద్రోహం చేశార‌ని అన్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌న‌ని చెప్పి.. వంచించార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన కాపును తాజాగా వైసీపీ పక్క‌న పెట్టింది. ఆయ‌న స్థానంలో వేరేవారిని నియ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ నేప‌థ్యంలో కాపు బ్లాస్ట్ అయ్యారు.

సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని కాపు రామ‌చంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు. “రాయదుర్గం నుంచి నా భార్య తప్పని సరిగా పోటీ చేస్తారు. సీఎంను కలిసి మాట్లాడడం మాకు కుదరలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదు. క‌నీసం మేం వ‌చ్చామ‌ని చెప్పినా.. ప‌ట్టించుకోలేదు. ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదు. నమ్మించి మా గొంతు కోశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ త‌ర‌ఫున అయినా పోటీకి సిద్దం” అని కాపు నిప్పులు చెరిగారు.

అయితే.. తాను ఏపార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే చెబుతాన‌ని కాపు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌లేద‌న్నారు. “మా ఇంటి నిండా లైట్ లు వేస్తే జగన్ ఫోటో లే కనబడతాయి. వైసీపీ పెట్టినప్పుడు ఐదేళ్లు పదవీకాలం వదులుకొని వచ్చాను. 2014, 2019లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారు. రాత్రి, పగలు గడప గడపకు తిరిగాను అయిన సర్వే పేరుతో టికెట్ నిరాకరించారు. మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి. ఈ రోజు వరకు జగన్ మా దేవుడు అనుకున్నాం. జగన్ మా గొంతు కొస్తాడనుకోలేదు. స్వతంత్రంగా గెలిచే సత్తా కూడా మాకు ఉంది” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on January 5, 2024 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

7 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago