తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో కలిసి పరామర్శించారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడిపారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలను, ఆయన కోలుకుంటున్న వైనం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.
జగన్ వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు జగన్, కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక, కేసీఆర్ ను పరామర్శించిన వెంటనే జగన్ నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడిన జగన్ ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి తాడేపల్లి బయలుదేరారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వచ్చారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక నేపథ్యంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయమ్మతో కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయంపై జగన్ మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతుంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…