Political News

కేసీఆర్ ను పరామర్శించిన జగన్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో కలిసి పరామర్శించారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడిపారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలను, ఆయన కోలుకుంటున్న వైనం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

జగన్ వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు జగన్, కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక, కేసీఆర్ ను పరామర్శించిన వెంటనే జగన్ నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడిన జగన్ ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి తాడేపల్లి బయలుదేరారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వచ్చారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక నేపథ్యంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయమ్మతో కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయంపై జగన్ మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతుంది.

This post was last modified on January 4, 2024 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

11 minutes ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

1 hour ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

2 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

3 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

3 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

6 hours ago