తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో కలిసి పరామర్శించారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడిపారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలను, ఆయన కోలుకుంటున్న వైనం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.
జగన్ వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు జగన్, కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక, కేసీఆర్ ను పరామర్శించిన వెంటనే జగన్ నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడిన జగన్ ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి తాడేపల్లి బయలుదేరారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వచ్చారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక నేపథ్యంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయమ్మతో కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయంపై జగన్ మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతుంది.
This post was last modified on January 4, 2024 11:05 pm
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…