Political News

కేసీఆర్ ను పరామర్శించిన జగన్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో కలిసి పరామర్శించారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడిపారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలను, ఆయన కోలుకుంటున్న వైనం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

జగన్ వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు జగన్, కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక, కేసీఆర్ ను పరామర్శించిన వెంటనే జగన్ నేరుగా లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడిన జగన్ ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి తాడేపల్లి బయలుదేరారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వచ్చారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక నేపథ్యంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయమ్మతో కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరిక విషయంపై జగన్ మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతుంది.

This post was last modified on January 4, 2024 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

59 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago