Political News

వైసీపీ సిట్టింగ్ ల సెకండ్ లిస్ట్ ఇదే

ప్రస్తుతం ఏపీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంపు నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో…జగన్ నోటి నుంచి ఏం వినాల్సి వస్తుందో అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ 11 మంది సిట్టింగ్ నేతల స్థానాలను మార్చిన జగన్ రెండో జాబితాపై గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రెండో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది.

కొన్ని అసెంబ్లీ, కొన్ని లోక్ సభ స్థానాల ఇన్చార్జిలను మారుస్తూ తాజాగా వైసీపీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. 27 మందితో విడుదలైన జాబితాలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలు మారాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారమే ఈ నియామకాలు చేపట్టామని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ 27 మందిలో కొందరు నేతల వారసులు ఉన్నారు. 11 మందిని మార్చిన నేపథ్యంలోనే వైసీపీలో అంతర్గత కలహాలు, అసంతృప్త నేతల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 27 మందితో రెండో జాబితా విడుదలైన నేపథ్యంలో తమ స్థానాలు కోల్పోయిన నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, కొందరు నేతలకు టికెట్ ఇవ్వబోనని కరాఖండిగా జగన్ చెప్పేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వారికి పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి కొందరు ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని, తమకు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వెల్లడించాలని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేక ప్రత్యామ్నాయ మార్గాలు లేక గతిలేని స్థితిలో వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

వైసీపీ విడుదల చేసిన 27 మంది ఇన్చార్జిల జాబితా

అనంతపురం పార్లమెంటు – శంకరనారాయణ

హిందూపురం పార్లమెంటు – శాంతమ్మ

అరకు పార్లమెంటు – భాగ్యలక్ష్మి

పెనుకొండ – ఉషశ్రీ చరణ్

ఎర్రగొండపాలెం – తాటిపర్తి రాజశేఖర్

ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్

గుంటూరు ఈస్ట్ – షేక్ నూర్ ఫాతిమా

మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి(కిట్టూ)

కల్యాణదుర్గం – తలారి రంగయ్య

అరకు అసెంబ్లీ – గొడ్డేటి మాధవి

విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు

పిఠాపురం – వంగా గీత

రాజాం – తాలే రాజేష్

ప్రత్తిపాడు – వరపుల సుబ్బారావు

తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్

రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాశ్

పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు

విజయవాడ వెస్ట్ – షేక్ అసీఫ్

చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

కదిరి – మక్బుల్ అహ్మద్

అనకాపల్లి – మలకాపల్లి భరత్ కుమార్

జగ్గంపేట – తోట నరసింహం

పాయకరావు పేట – కంబాల జోగులు

రాజమండ్రి రూరల్ – వేణుగోపాల కృష్ణ

పి. గన్నవరం – వేణుగోపాల్

పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి

Satya

Recent Posts

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

3 minutes ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

52 minutes ago

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

1 hour ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

1 hour ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

3 hours ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

3 hours ago