Political News

బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా?

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అదేమిటంటే  కేసీయార్, బీఆర్ఎస్ పనైపోయిందని. ఇదే విషయాన్ని కమలనాదులంతా ఉద్దేశ్యపూర్వకంగా పదేపదే ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యమాత్రమే ఉంటుందని కావాలనే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీయార్ పనైపోయిందని అవసరం లేకపోయినా ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో పాటు 16 నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో నిలవటమే.

కాంగ్రెస్ గెలిచిన 16 నియోజకవర్గాల్లో బీజేపీ సెకండ్ ప్లేసులో నిలిస్తే బీఆర్ఎస్ మూడోప్లేసులో నిలిచిందని కరీంనగర్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని జనాలందరు గుర్తించినట్లు బండి చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని జనాలు అనుకున్నదే నిజమైతే మరి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 39 నియోజకవర్గాల్లో ఎలా గెలిచింది ? అంటే మాత్రం సమాధానం చెప్పటంలేదు.

కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లలో బీజేపీ గెలిచుంటే బండి చెప్పింది నిజమే అనుకునే అవకాశముంది. కానీ అలా జరగలేదన్న విషయాన్ని బండి ఉద్దేశ్యపూర్వకంగానే మరుగున పడేస్తున్నారు. మొన్ననే జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయుండచ్చు. అయితే ఇదే ఎన్నికల్లో బీజేపీ అసలు సోదిలోకి కూడా కనబడలేదు. కాబట్టి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే కానీ బీజేపీ ఎంతమాత్రం కాదన్న విషయం అందరికీ తెలుసు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఏకైక కారణంగానే తెలంగాణాలో బీజేపీ రెచ్చిపోతోందని అందరికీ అర్ధమైంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లలో గెలుపును కమలనాదులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పారు. అయితే అమిత్ చెప్పినంత మాత్రాన బీజేపీ గెలవదు. జనాలు ఓట్లేస్తేనే కమలంపార్టీ గెలుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మరి చివరకు ఏమవుతుందో తెలీదు కానీ కేసీయార్ మీద బీజేపీ మాత్రం మైండ్ గేమ్ ఆడేస్తోంది.

This post was last modified on January 1, 2024 5:36 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

25 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago