Political News

కాళేశ్వరం ఫెయిల్యూర్ గా మిగిలిపోవాల్సిందేనా?

కేసీయార్ ఎంతో గొప్పగా ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయేట్లుంది. ప్రాజెక్టును మొదలుపెట్టింది కోట్ల రూపాయలు దోచుకోవటానికే అని మొదటినుండి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళ ఆరోపణలకు తగ్గట్లే కాళేశ్వరం నిర్మాణంలోని నాణ్యతాలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి ప్రాంతంలో చీలిక రావటమంతా కేసీయార్ ఫెయిల్యూర్ కు సాక్ష్యంగా నిలుస్తోంది.

తాజాగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన మంత్రులు బృందం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టేసి ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు ప్రాణంపోస్తామన్నట్లుగా ప్రకటించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుచేసిన కేసీయార్ చివరకు లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేకపోయారంటే మంత్రులు మండిపోయారు. రేవంత్ రెడ్డి ఆలోచనలు, మంత్రుల ప్రకటనలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో షోపీస్ ప్రాజెక్టుగా మాత్రమే మిగిలిపోయేట్లుంది. కేసీయార్ హయాంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యానికి గురైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

రెండు ప్రాజెక్టులు కూడా గోదావరి నీటి లభ్యత ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువబాగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్ధాపన చేసిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును  నిర్మించుంటే వేలకోట్ల రూపాయలు ఆదాఅయ్యుండేవి. కానీ ప్రాణహితను కేసీయార్ పక్కనపెట్టేసి అనవసరంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తుకున్నారు. వైఎస్ హయాంలో రు. 35 వేల కోట్ల అంచనా వ్యయం ప్రాజెక్టును కేసీయార్ సుమారు లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్ళారు. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకున్నా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వ్యయం సుమారు రు. 39 వేల కోట్లే.

కాళేశ్వరం ఎందుకు షోకేస్ ప్రాజెక్టుగా మారబోతోందంటే అది నాణ్యతా లోపాలతో నిర్మించారన్న విషయం బయటపడింది. పూర్తి స్థాయి 141 టీఎంసీ నీటి నిల్వ చేస్తే ప్రాజెక్టు తట్టుకోలేందని బయటపడింది. అందుకనే ప్రాణహిత ప్రాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మించి కాళేశ్వరానికి బదులుగా వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రులు చెప్పారు. అంటే కాళేశ్వరంకు కేసీయార్ చేసిన లక్ష కోట్ల రూపాయల వ్యయం బూడిదలో పోసినట్లుగా తయారవ్వబోతోంది. అందుకనే కేసీయార్ ఫెయిల్యూర్+అవినీతిని మొత్తం తెలంగాణా అంతా చాటిచెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. 

This post was last modified on December 30, 2023 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

11 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

30 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

42 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

50 minutes ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago