Political News

కాళేశ్వరం ఫెయిల్యూర్ గా మిగిలిపోవాల్సిందేనా?

కేసీయార్ ఎంతో గొప్పగా ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయేట్లుంది. ప్రాజెక్టును మొదలుపెట్టింది కోట్ల రూపాయలు దోచుకోవటానికే అని మొదటినుండి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళ ఆరోపణలకు తగ్గట్లే కాళేశ్వరం నిర్మాణంలోని నాణ్యతాలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి ప్రాంతంలో చీలిక రావటమంతా కేసీయార్ ఫెయిల్యూర్ కు సాక్ష్యంగా నిలుస్తోంది.

తాజాగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన మంత్రులు బృందం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టేసి ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు ప్రాణంపోస్తామన్నట్లుగా ప్రకటించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుచేసిన కేసీయార్ చివరకు లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేకపోయారంటే మంత్రులు మండిపోయారు. రేవంత్ రెడ్డి ఆలోచనలు, మంత్రుల ప్రకటనలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో షోపీస్ ప్రాజెక్టుగా మాత్రమే మిగిలిపోయేట్లుంది. కేసీయార్ హయాంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యానికి గురైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

రెండు ప్రాజెక్టులు కూడా గోదావరి నీటి లభ్యత ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువబాగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్ధాపన చేసిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును  నిర్మించుంటే వేలకోట్ల రూపాయలు ఆదాఅయ్యుండేవి. కానీ ప్రాణహితను కేసీయార్ పక్కనపెట్టేసి అనవసరంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తుకున్నారు. వైఎస్ హయాంలో రు. 35 వేల కోట్ల అంచనా వ్యయం ప్రాజెక్టును కేసీయార్ సుమారు లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్ళారు. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకున్నా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వ్యయం సుమారు రు. 39 వేల కోట్లే.

కాళేశ్వరం ఎందుకు షోకేస్ ప్రాజెక్టుగా మారబోతోందంటే అది నాణ్యతా లోపాలతో నిర్మించారన్న విషయం బయటపడింది. పూర్తి స్థాయి 141 టీఎంసీ నీటి నిల్వ చేస్తే ప్రాజెక్టు తట్టుకోలేందని బయటపడింది. అందుకనే ప్రాణహిత ప్రాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మించి కాళేశ్వరానికి బదులుగా వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రులు చెప్పారు. అంటే కాళేశ్వరంకు కేసీయార్ చేసిన లక్ష కోట్ల రూపాయల వ్యయం బూడిదలో పోసినట్లుగా తయారవ్వబోతోంది. అందుకనే కేసీయార్ ఫెయిల్యూర్+అవినీతిని మొత్తం తెలంగాణా అంతా చాటిచెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. 

This post was last modified on December 30, 2023 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…

31 minutes ago

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

5 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

6 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

9 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

9 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

9 hours ago