Political News

పక్కా ప్లాన్ తో రెడీ అవుతోందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. ప్రతి అడుగులోను జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ప్రజాపాలన, అభయహస్తం, లబ్దిదారుల ఎంపికకు గ్రామసభలు, ప్రగతిభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించటం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజాధరణను దృష్టిలో పెట్టుకునే చేసింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించటం కూడా ఇందులో భాగమే.

ఏ పనిచేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా జనాకర్షణే ధ్యేయంగా చేస్తోంది. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలన్నదే రేవంత్ రెడ్డి టార్గెట్. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీని చావుదెబ్బకొట్టాలన్నది రేవంత్ టార్గెట్ గా కనబడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అదేమంత గొప్ప విజయం కాదన్నది అందరికీ తెలిసిందే. ఎలాగంటే 119 సీట్ల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. 60 సీట్లు దాటిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఈ పద్దతిలో చూస్తే కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 64 సీట్లు అంటే నాలుగు సీట్లు మాత్రమే అదనంగా వచ్చింది. ఇదేమంత గొప్ప మెజారిటి కాదనే చెప్పాలి. అదే 70 సీట్లు దాటుంటే అప్పుడు మంచి విజయమని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారట.

ఇపుడున్న 19 సీట్లలో కాంగ్రెస్ బలం సున్నా. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లలో గెలిచింది. అప్పట్లో ఎంపీలుగా గెలిచిన రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచారు. అందుకనే ఎంపీలుగా రాజీనామాలు చేశారు. దాంతో తెలంగాణా నుండి కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరు. అందుకనే రాబోయే ఎన్నికల్లో కనీసం 10 సీట్లకు తక్కువ కాకుండా గెలవాలని ప్లాన్ చేస్తున్నారట. చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on December 29, 2023 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

11 hours ago