Political News

పక్కా ప్లాన్ తో రెడీ అవుతోందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది. ప్రతి అడుగులోను జనాలను ఆకర్షించటమే టార్గెట్ గా ముందుకు వెళుతోంది. ప్రజాపాలన, అభయహస్తం, లబ్దిదారుల ఎంపికకు గ్రామసభలు, ప్రగతిభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించటం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజాధరణను దృష్టిలో పెట్టుకునే చేసింది. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించటం కూడా ఇందులో భాగమే.

ఏ పనిచేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా జనాకర్షణే ధ్యేయంగా చేస్తోంది. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలన్నదే రేవంత్ రెడ్డి టార్గెట్. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీని చావుదెబ్బకొట్టాలన్నది రేవంత్ టార్గెట్ గా కనబడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అదేమంత గొప్ప విజయం కాదన్నది అందరికీ తెలిసిందే. ఎలాగంటే 119 సీట్ల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. 60 సీట్లు దాటిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఈ పద్దతిలో చూస్తే కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 64 సీట్లు అంటే నాలుగు సీట్లు మాత్రమే అదనంగా వచ్చింది. ఇదేమంత గొప్ప మెజారిటి కాదనే చెప్పాలి. అదే 70 సీట్లు దాటుంటే అప్పుడు మంచి విజయమని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారట.

ఇపుడున్న 19 సీట్లలో కాంగ్రెస్ బలం సున్నా. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లలో గెలిచింది. అప్పట్లో ఎంపీలుగా గెలిచిన రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచారు. అందుకనే ఎంపీలుగా రాజీనామాలు చేశారు. దాంతో తెలంగాణా నుండి కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరు. అందుకనే రాబోయే ఎన్నికల్లో కనీసం 10 సీట్లకు తక్కువ కాకుండా గెలవాలని ప్లాన్ చేస్తున్నారట. చివరకు ఏమవుతుందో చూడాలి.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 minute ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

34 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

42 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago