వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకునే అంశంపై పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఢిల్లీ లో తాజాగా జరిగిన ఏపీసీసీ(ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ) సమావేశంలో షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలపై చర్చ జరిగింది. షర్మిల పేరును ఏపీసీసీ చీఫ్ గా ప్రతిపాదించిన పీఏసీ మెంబర్, ఏపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు.. ఆమె ప్రాతినిధ్యంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని బలంగా పేర్కొన్నట్టు తెలిసింది.
ఇక, మాజీ ఎంపీలు హర్షకుమార్, చింతా మోహన్ మినహా మిగిలిన వారంతా షర్మిల పేరు ప్రతిపాదన కు మద్దతు తెలిపినట్టు తెలిసింది. మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం.. షర్మిల వచ్చినా.. ఏపీలో ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నట్టు సమాచారం. ఇక, చింతా మోహన్.. తనకు ఏపీ బాధ్యతలు అప్పగించాలని, అధ్యక్షుడిని చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే.. ఈ ఇద్దరి వాదనలను కూడా పార్టీ పక్కన పెట్టగా.. మెజారిటీ వాదన ప్రకారం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలిసింది. ఇక, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పార్టీకి చేసిన సేవల నేపథ్యంలో షర్మిలకు బాధ్యతలను అప్పగించడంపై దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం.
ఇదిలావుంటే,.. ప్రస్తుతం షర్మిలకు ఒక పార్టీ ఉంది. ఒక పార్టీకి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పార్టీ వైఎస్సార్ తెలంగాణను కాంగ్రెస్లో విలీనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆమెకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీని విలీనం చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ.. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని సీనియర్లు పేర్కొన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. “వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల అంటే మాకు గౌరవం ఉంది. షర్మిలకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చేదీ అధ్యక్షుడు ఖర్గేనే నిర్ణయం తీసుకుంటారు.” అని మాణిక్యం ఠాకూర్ తెలిపారు. దీంతో ఇప్పుడు షర్మిల ఎలా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
This post was last modified on December 27, 2023 9:36 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…