Political News

రేవంత్ డిమాండ్.. ఏపీకీ మేలేగా

విభ‌జ‌న హామీల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దత‌గా ఉన్న వాతావ‌ర‌ణాన్ని ఛేదిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేసి వ‌చ్చారు. పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని, ఈ హామీల‌కు ఇప్ప‌టికే ప‌దేళ్లు గ‌డిచిపోయాయ‌ని ఇప్ప‌టికైనా హామీల‌ను అమ‌లు చేయాల ని సీఎం రేవంత్ నేరుగా ప్ర‌దానిని క‌లిసి డిమాండ్ చేశారు. దీనిపై ఒక క‌ద‌లిక అయితే వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా ఈ దిశ‌గా క‌ద‌లిక అయితే రాలేదు. కేంద్రంపై దండెత్తుతామ‌ని ప‌దే ప‌దే చెప్పినా.. విభ‌జ‌న హామీల విష‌యానికి వ‌స్తే.. బీఆర్ ఎస్ కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత మైంద‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలో అనూహ్యంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ త‌ర‌హా క‌ద‌లిక రావ‌డం ఇటు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. నేరుగా ప్ర‌ధానిని క‌లిసి విభ‌జ‌న స‌మ‌స్య‌పై ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. ఇవే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏపీలోనూ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విశాఖ మెట్రో వంటివి అప‌రిష్కృతంగా ఉన్నాయి. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ నిధులు కూడా అవ‌స‌రం. ఎన్నిక‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ అంశాలు చ‌ర్చ‌ల‌కు వ‌స్తున్నాయి. వీటిపై పోర‌డ‌తామ‌ని చెబుతు న్నప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. అయితే.. విభ‌జ‌న హామీల‌పై రెండు రాష్ట్రాలూ క‌లిసి పోరాడితే కొంత క‌ద‌లిక వ‌స్తుంద‌ని మేధావి వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ, రెండురాష్ట్రాలు ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి పోరాడింది లేదు. కార‌ణాలు ఏవైనా.. కేంద్రంపై క‌లిసి ఒత్తిడి కూడా తేలేదు. ఇప్పుడు ఇలాంటి నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు పెంచ‌డం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారులో క‌ద‌లిక తెచ్చేలా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో ఏపీ కూడా ఇదే చొర‌వ ప్ర‌ద‌ర్శించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే చొర‌వ‌తో ముందుకు సాగితే.. ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

This post was last modified on December 27, 2023 2:55 pm

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

53 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

2 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

2 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago