Political News

రేవంత్ డిమాండ్.. ఏపీకీ మేలేగా

విభ‌జ‌న హామీల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దత‌గా ఉన్న వాతావ‌ర‌ణాన్ని ఛేదిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేసి వ‌చ్చారు. పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని, ఈ హామీల‌కు ఇప్ప‌టికే ప‌దేళ్లు గ‌డిచిపోయాయ‌ని ఇప్ప‌టికైనా హామీల‌ను అమ‌లు చేయాల ని సీఎం రేవంత్ నేరుగా ప్ర‌దానిని క‌లిసి డిమాండ్ చేశారు. దీనిపై ఒక క‌ద‌లిక అయితే వ‌చ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా ఈ దిశ‌గా క‌ద‌లిక అయితే రాలేదు. కేంద్రంపై దండెత్తుతామ‌ని ప‌దే ప‌దే చెప్పినా.. విభ‌జ‌న హామీల విష‌యానికి వ‌స్తే.. బీఆర్ ఎస్ కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత మైంద‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలో అనూహ్యంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ త‌ర‌హా క‌ద‌లిక రావ‌డం ఇటు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. నేరుగా ప్ర‌ధానిని క‌లిసి విభ‌జ‌న స‌మ‌స్య‌పై ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. ఇవే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏపీలోనూ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విశాఖ మెట్రో వంటివి అప‌రిష్కృతంగా ఉన్నాయి. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ నిధులు కూడా అవ‌స‌రం. ఎన్నిక‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ అంశాలు చ‌ర్చ‌ల‌కు వ‌స్తున్నాయి. వీటిపై పోర‌డ‌తామ‌ని చెబుతు న్నప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. అయితే.. విభ‌జ‌న హామీల‌పై రెండు రాష్ట్రాలూ క‌లిసి పోరాడితే కొంత క‌ద‌లిక వ‌స్తుంద‌ని మేధావి వ‌ర్గాలు చెబుతున్నాయి.

కానీ, రెండురాష్ట్రాలు ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి పోరాడింది లేదు. కార‌ణాలు ఏవైనా.. కేంద్రంపై క‌లిసి ఒత్తిడి కూడా తేలేదు. ఇప్పుడు ఇలాంటి నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు పెంచ‌డం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారులో క‌ద‌లిక తెచ్చేలా వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో ఏపీ కూడా ఇదే చొర‌వ ప్ర‌ద‌ర్శించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే చొర‌వ‌తో ముందుకు సాగితే.. ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

6 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

9 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

9 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

10 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

10 hours ago