Political News

వైసీపీకి జ్యోతుల చంటిబాబు గుడ్ బై?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని టీడీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే . జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆ క్రమంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను మార్చారని టిడిపి నేతలు అంటున్నారు. మరో 70 మంది వరకు సిట్టింగ్లను మార్చే యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ రాని వైసీపీ నేతలు పక్క పార్టీ వైపు చూస్తున్నారని టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీకి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే చంటిబాబు టిడిపిలో చేరబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో చంటిబాబు చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి పోటీ చేసిన చంటిబాబు ఓడిపోయారు. 2014లో టిడిపి అధికారంలోకి రాగానే ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ గా చంటిబాబును చంద్రబాబు నియమించారు. జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని టిడిపి అధిష్టానం చెప్పినప్పటికీ వేరే చోట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని కూడా చంటిబాబు కోరుతున్నారని తెలుస్తోంది.

అయితే, అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టిడిపి అధిష్టానం చంటిబాబుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. 2024 జనవరి 5,6 తేదీల్లో చంటిబాబు సైకిల్ ఎక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం చంటిబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘‘గాడిద గుడ్డు…పార్టీలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి…ఈ పార్టీలో శాశ్వతంగా ఉంటామా అంటూ చంటిబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఈరోజు ఈ పార్టీలో ఉన్నవారు రేపు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారేమో ఎవరికి తెలుసు అంటూ చంటిబాబు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఆయన టిడిపిలోకి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ కామెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది.

This post was last modified on December 25, 2023 8:46 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

20 minutes ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

3 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

3 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago