తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు.
సీఎం అయిన తర్వాత ప్రజా పాలన అందించాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ వివిధ ప్రభుత్వ విభాగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడంలో కీలకంగా వ్యవహరించాల్సిన కలెక్టర్లు, ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించే పోలీసు విభాగాలపై రేవంత్ ధ్యాస మళ్లించారు. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పౌరులతో గౌరవంగా ఉండాలి కానీ క్రిమినల్స్ తో కాదని.. గంజాయి, డ్రగ్స్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండొద్దని రేవంత్ అన్నారు. నేరాలు, హత్యలు చేసిన వాళ్లను ఫ్రెండ్స్ గా చూడొద్దని గట్టిగానే చెప్పారు. డ్రగ్స్, గంజాయి మాఫియాను వదలొద్దన్నారు. అంతే కాకుండా సన్ బర్న్ పార్టీకి అనుమతి ఇంకా ఇవ్వకుండానే టికెట్లు ఎలా అమ్ముతున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. దీన్ని బట్టి పోలీసు విభాగంపై రేవంత్ ఎలాంటి ఫోకస్ పెట్టారో తెలుస్తోంది.
మరోవైపు కలెక్టర్లు కూడా జవాబుదారీతనంతో వ్యవహరించాలని రేవంత్ సూచించారు. తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ను గుర్తు చేసుకుని ఐఏఎస్ లు విధి నిర్వహణలో ఉత్తమంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజలతో శభాష్ అనిపించుకున్నంతవరకే ప్రభుత్వం అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటారని రేవంత్ అన్నారు. కాదని నిర్లక్ష్యం వహించినా, తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రేవంత్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on December 25, 2023 8:30 pm
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…