Political News

వార్నింగ్ ఇస్తున్న రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు చేస్తే వదిలేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్.. వివిధ విభాగాల్లో సమీక్షలపై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ మాత్రం తప్పు దొరికినా, ఎవరైనా తేడాగా ప్రవర్తించినా రేవంత్ మండిపడుతున్నారని తెలిసింది. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసే ఏ అధికారినైనా వదిలి పెట్టేదే లేదని చెప్పారు.

సీఎం అయిన తర్వాత ప్రజా పాలన అందించాలనే లక్ష్యంతో ఉన్న రేవంత్ వివిధ ప్రభుత్వ విభాగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడంలో కీలకంగా వ్యవహరించాల్సిన కలెక్టర్లు, ప్రజలు స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించే పోలీసు విభాగాలపై రేవంత్ ధ్యాస మళ్లించారు. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పౌరులతో గౌరవంగా ఉండాలి కానీ క్రిమినల్స్ తో కాదని.. గంజాయి, డ్రగ్స్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండొద్దని రేవంత్ అన్నారు. నేరాలు, హత్యలు చేసిన వాళ్లను ఫ్రెండ్స్ గా చూడొద్దని గట్టిగానే చెప్పారు. డ్రగ్స్, గంజాయి మాఫియాను వదలొద్దన్నారు. అంతే కాకుండా సన్ బర్న్ పార్టీకి అనుమతి ఇంకా ఇవ్వకుండానే టికెట్లు ఎలా అమ్ముతున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. దీన్ని బట్టి పోలీసు విభాగంపై రేవంత్ ఎలాంటి ఫోకస్ పెట్టారో తెలుస్తోంది.

మరోవైపు కలెక్టర్లు కూడా జవాబుదారీతనంతో వ్యవహరించాలని రేవంత్ సూచించారు. తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ను గుర్తు చేసుకుని ఐఏఎస్ లు విధి నిర్వహణలో ఉత్తమంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజలతో శభాష్ అనిపించుకున్నంతవరకే ప్రభుత్వం అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటారని రేవంత్ అన్నారు. కాదని నిర్లక్ష్యం వహించినా, తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రేవంత్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

This post was last modified on December 25, 2023 8:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

26 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago