రాష్ట్రంలో కీలక రాజకీయంగా మారిన వ్యవహారం జనసేన వర్సెస్ కాపులు. వచ్చే ఎన్నికల్లో కాపులు జన సేనకు మద్దతుగా ఉంటున్నారా? ఉండడం లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాపుల అభిప్రాయాలు తెలుసుకోవడంలోనూ.. వారి నాడిని పట్టుకోవడంలోనూ జనసేన అధినేత పవన్ విఫలమ య్యారా? అనేది కూడా ఆసక్తిగా మారింది. జనసేన పార్టీనిస్థాపించి పదేళ్లు దాటిపోయాయి. అయినప్పటి కీ.. ఇప్పటికీ సిద్ధాంతంలో రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది.
ముఖ్యంగా పార్టీ అదినేత పవన్.. ఒక దిశాగమనంలో పయనిస్తున్నట్టుగా కనిపించడం లేదు. కొన్నాళ్లు.. తమకు అధికారం ఎందుకు రాకూడదని ప్రశ్నిస్తారు. మరి కొన్నాళ్లు కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడదా? అని అంటారు. తర్వాత.. అనూహ్యంగా అదే నోటితో పదవులు అవసరం లేదని చెబుతారు. ఇకొన్నాళ్లు తమ పార్టీకి పాతికేళ్ల ప్రస్థానం ఉందని అంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తనను ప్రశ్నించనే కూడదనే ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడం మరింత ఇబ్బందిగా మారింది.
వాస్తవానికి ఇప్పుడున్న పార్టీలకు.. అది ఏదైనా.. సామాజిక వర్గాల బలం కీలకం. ఈ కోణంలో చూసుకుం టే.. జనసేనకు కాపుల బలం ఉండి తీరాలి. గతంలో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి వెంట దాదాపు కాపు లు నిలబడ్డారు. ఆ పరిస్థితి జనసేనలో కనిస్తుందా? అంటే.. తర్జన భర్జన కొనసాగుతోందనే చెప్పాలి. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది మరింత పీక్ స్థాయికి చేరుకుంది. దీంతో కాపులను జనసేన అధినేత అర్ధం చేసుకోవడం లేదా? లేక.. వారికే పవన్ అర్ధం కావడం లేదా? అనేది చర్చగా మారింది.
వాస్తవానికి కాపులకు చాలానే యాస్పిరేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల నుంచి అధికార పదవుల వరకు.. రాజ్యాధికారం నుంచి రాజకీయాల్లోనూ వారు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా జనసేనతో సాకారం అవుతాయని కలలు కన్నారు. ఈ దిశగానే పవన్తో కలిసి అడుగులు వేశారు.కానీ, జనసేన వైఖరి వారిని మెప్పించేదిగా లేకపోవడం.. అడుగడుగునా.. పంథానుమార్చుకుంటూ పోతుండడంతో కాపులు అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి ఎప్పటికి ఈ తర్జన భర్జనకు తెరపడుతుందో చూడాలి.
This post was last modified on December 25, 2023 5:38 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…