Political News

వైసీపీ కోసం ఐ ప్యాక్! టీడీపీ కోసం పీకే?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్తి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దేశ రాజకీయాలలోనే సీనియర్ రాజకీయ నాయకుడని, తనను కలవాలని కోరడంతోనే ఆయనతో భేటీ అయ్యానని పీకే వెల్లడించారు. అయితే, మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని పీకే చెప్పారు.

మరోవైపు, తాము వైసీపీతోనే ఉన్నామంటూ ఐ ప్యాక్ సంస్థ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. గత ఏడాది కాలంగా వైసీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపడతారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అలా చేయడమే లక్ష్యంగా వైసీపీతో కలిసి అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ఐ ప్యాక్ టీం వెల్లడించింది.

ఐ ప్యాక్ తాజా ప్రకటనతో ఐప్యాక్ కు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదని స్పష్టమైనట్టు కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ఐప్యాక్ టీం వ్యతిరేకించిందని, కానీ జగన్ వారి మాటలను పెడచెవిన పెట్టి ముందుకు వెళ్లారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే మీడియాలో చంద్రబాబు అరెస్టు వార్త వచ్చేవరకు ఐ ప్యాక్ సభ్యులకు తెలియకపోవడంతో జగన్ వ్యవహర శైలికపై ఐ ప్యాక్ కూడా గుర్రుగా ఉందని తెలుస్తోంది.

అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరికొంత కాలం వైసీపీతోనే ఐప్యాక్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, వైసీపీ కోసం ఐ ప్యాక్…చంద్రబాబు కోసం పీకే పని చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, టీడీపీ కోసం పనిచేయబోతున్నానని పీకే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

This post was last modified on December 24, 2023 9:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago