Political News

వైసీపీ కోసం ఐ ప్యాక్! టీడీపీ కోసం పీకే?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్తి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దేశ రాజకీయాలలోనే సీనియర్ రాజకీయ నాయకుడని, తనను కలవాలని కోరడంతోనే ఆయనతో భేటీ అయ్యానని పీకే వెల్లడించారు. అయితే, మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని పీకే చెప్పారు.

మరోవైపు, తాము వైసీపీతోనే ఉన్నామంటూ ఐ ప్యాక్ సంస్థ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. గత ఏడాది కాలంగా వైసీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపడతారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అలా చేయడమే లక్ష్యంగా వైసీపీతో కలిసి అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ఐ ప్యాక్ టీం వెల్లడించింది.

ఐ ప్యాక్ తాజా ప్రకటనతో ఐప్యాక్ కు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదని స్పష్టమైనట్టు కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ఐప్యాక్ టీం వ్యతిరేకించిందని, కానీ జగన్ వారి మాటలను పెడచెవిన పెట్టి ముందుకు వెళ్లారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే మీడియాలో చంద్రబాబు అరెస్టు వార్త వచ్చేవరకు ఐ ప్యాక్ సభ్యులకు తెలియకపోవడంతో జగన్ వ్యవహర శైలికపై ఐ ప్యాక్ కూడా గుర్రుగా ఉందని తెలుస్తోంది.

అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరికొంత కాలం వైసీపీతోనే ఐప్యాక్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, వైసీపీ కోసం ఐ ప్యాక్…చంద్రబాబు కోసం పీకే పని చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, టీడీపీ కోసం పనిచేయబోతున్నానని పీకే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

This post was last modified on December 24, 2023 9:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

44 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

5 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

7 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago