Political News

పేకాట పుణ్యం.. 24 మందికి క‌రోనా

సూర్యా పేట‌లో క‌రోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెర‌గ‌డానికి ఓ మ‌హిళ కార‌ణం కావ‌డం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండ‌టం వ‌ల్ల 30 మందికి పైగా క‌రోనా బారిన ప‌డ‌టం తెలిసిన సంగ‌తే. సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న త‌ర్వాత తాజాగా విజ‌య‌వాడ‌లో ఓ వ్య‌క్తి స‌ర‌దా 24 మందిని క‌రోనా బారిన ప‌డేలా చేసింది. ఓ వ్య‌క్తి లాక్ డౌన్ టైంలో క‌రోనా అంటించుకుని.. పేకాట ఆడ‌టం వ‌ల్ల ఇంత‌మంది క‌రోనా వ్యాధిగ్ర‌స్థులు కావ‌డానికి కార‌ణ‌మైంద‌ని స్వ‌యంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. విజ‌య‌వాడ‌లోని కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని ఆయ‌న వివ‌రించారు.

కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచిన ఆ వ్య‌క్తి పేకాట ఆడాడని.. వాళ్లంద‌రికీ అత‌డి నుంచి క‌రోనా సోకింద‌ని.. ఆ వ్య‌క్తులు వెళ్లి త‌మ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా అంటించార‌ని.. మొత్తంగా ఈ ఛైన్లో 24 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని కలెక్టర్‌ తెలిపారు. విజ‌య‌వాడ‌లోనే కార్మికనగర్‌లో మరో లారీ డ్రైవర్ ఇలాగే నిర్లక్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల 15 మందికి కరోనా సోకిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఇలా 40 మంది దాకా క‌రోనా బారిన ప‌డ్డార‌ని.. ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డాల‌ని క‌లెక్టర్ హెచ్చ‌రించారు. విజ‌య‌వాడలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టం.. రెడ్ జోన్‌గా మార‌డంతో అక్క‌డ అనేక ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఆదివారం నాడు నగరంలో చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

This post was last modified on April 26, 2020 1:04 am

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

45 minutes ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

2 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

3 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

4 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

4 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

5 hours ago