Political News

పేకాట పుణ్యం.. 24 మందికి క‌రోనా

సూర్యా పేట‌లో క‌రోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెర‌గ‌డానికి ఓ మ‌హిళ కార‌ణం కావ‌డం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండ‌టం వ‌ల్ల 30 మందికి పైగా క‌రోనా బారిన ప‌డ‌టం తెలిసిన సంగ‌తే. సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న త‌ర్వాత తాజాగా విజ‌య‌వాడ‌లో ఓ వ్య‌క్తి స‌ర‌దా 24 మందిని క‌రోనా బారిన ప‌డేలా చేసింది. ఓ వ్య‌క్తి లాక్ డౌన్ టైంలో క‌రోనా అంటించుకుని.. పేకాట ఆడ‌టం వ‌ల్ల ఇంత‌మంది క‌రోనా వ్యాధిగ్ర‌స్థులు కావ‌డానికి కార‌ణ‌మైంద‌ని స్వ‌యంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. విజ‌య‌వాడ‌లోని కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని ఆయ‌న వివ‌రించారు.

కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచిన ఆ వ్య‌క్తి పేకాట ఆడాడని.. వాళ్లంద‌రికీ అత‌డి నుంచి క‌రోనా సోకింద‌ని.. ఆ వ్య‌క్తులు వెళ్లి త‌మ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా అంటించార‌ని.. మొత్తంగా ఈ ఛైన్లో 24 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని కలెక్టర్‌ తెలిపారు. విజ‌య‌వాడ‌లోనే కార్మికనగర్‌లో మరో లారీ డ్రైవర్ ఇలాగే నిర్లక్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల 15 మందికి కరోనా సోకిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఇలా 40 మంది దాకా క‌రోనా బారిన ప‌డ్డార‌ని.. ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డాల‌ని క‌లెక్టర్ హెచ్చ‌రించారు. విజ‌య‌వాడలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టం.. రెడ్ జోన్‌గా మార‌డంతో అక్క‌డ అనేక ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఆదివారం నాడు నగరంలో చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

This post was last modified on April 26, 2020 1:04 am

Share
Show comments
Published by
suman

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago