Political News

పేకాట పుణ్యం.. 24 మందికి క‌రోనా

సూర్యా పేట‌లో క‌రోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెర‌గ‌డానికి ఓ మ‌హిళ కార‌ణం కావ‌డం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండ‌టం వ‌ల్ల 30 మందికి పైగా క‌రోనా బారిన ప‌డ‌టం తెలిసిన సంగ‌తే. సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న త‌ర్వాత తాజాగా విజ‌య‌వాడ‌లో ఓ వ్య‌క్తి స‌ర‌దా 24 మందిని క‌రోనా బారిన ప‌డేలా చేసింది. ఓ వ్య‌క్తి లాక్ డౌన్ టైంలో క‌రోనా అంటించుకుని.. పేకాట ఆడ‌టం వ‌ల్ల ఇంత‌మంది క‌రోనా వ్యాధిగ్ర‌స్థులు కావ‌డానికి కార‌ణ‌మైంద‌ని స్వ‌యంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. విజ‌య‌వాడ‌లోని కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని ఆయ‌న వివ‌రించారు.

కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచిన ఆ వ్య‌క్తి పేకాట ఆడాడని.. వాళ్లంద‌రికీ అత‌డి నుంచి క‌రోనా సోకింద‌ని.. ఆ వ్య‌క్తులు వెళ్లి త‌మ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా అంటించార‌ని.. మొత్తంగా ఈ ఛైన్లో 24 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని కలెక్టర్‌ తెలిపారు. విజ‌య‌వాడ‌లోనే కార్మికనగర్‌లో మరో లారీ డ్రైవర్ ఇలాగే నిర్లక్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల 15 మందికి కరోనా సోకిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఇలా 40 మంది దాకా క‌రోనా బారిన ప‌డ్డార‌ని.. ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డాల‌ని క‌లెక్టర్ హెచ్చ‌రించారు. విజ‌య‌వాడలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టం.. రెడ్ జోన్‌గా మార‌డంతో అక్క‌డ అనేక ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఆదివారం నాడు నగరంలో చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

suman

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

51 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago