సూర్యా పేటలో కరోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెరగడానికి ఓ మహిళ కారణం కావడం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండటం వల్ల 30 మందికి పైగా కరోనా బారిన పడటం తెలిసిన సంగతే. సంచలనం రేపిన ఈ ఘటన తర్వాత తాజాగా విజయవాడలో ఓ వ్యక్తి సరదా 24 మందిని కరోనా బారిన పడేలా చేసింది. ఓ వ్యక్తి లాక్ డౌన్ టైంలో కరోనా అంటించుకుని.. పేకాట ఆడటం వల్ల ఇంతమంది కరోనా వ్యాధిగ్రస్థులు కావడానికి కారణమైందని స్వయంగా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు. విజయవాడలోని కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని ఆయన వివరించారు.
కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచిన ఆ వ్యక్తి పేకాట ఆడాడని.. వాళ్లందరికీ అతడి నుంచి కరోనా సోకిందని.. ఆ వ్యక్తులు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు కరోనా అంటించారని.. మొత్తంగా ఈ ఛైన్లో 24 మంది కరోనా బారిన పడ్డారని కలెక్టర్ తెలిపారు. విజయవాడలోనే కార్మికనగర్లో మరో లారీ డ్రైవర్ ఇలాగే నిర్లక్ష్యం వహించడం వల్ల 15 మందికి కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఇలా 40 మంది దాకా కరోనా బారిన పడ్డారని.. ఇకనైనా జాగ్రత్త పడాలని కలెక్టర్ హెచ్చరించారు. విజయవాడలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం.. రెడ్ జోన్గా మారడంతో అక్కడ అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ఆదివారం నాడు నగరంలో చికెన్, మటన్, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్ మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
This post was last modified on April 26, 2020 1:04 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…