సూర్యా పేటలో కరోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెరగడానికి ఓ మహిళ కారణం కావడం.. ఆమెకు అష్టాచెమ్మా ఆడే అలవాటు ఉండటం వల్ల 30 మందికి పైగా కరోనా బారిన పడటం తెలిసిన సంగతే. సంచలనం రేపిన ఈ ఘటన తర్వాత తాజాగా విజయవాడలో ఓ వ్యక్తి సరదా 24 మందిని కరోనా బారిన పడేలా చేసింది. ఓ వ్యక్తి లాక్ డౌన్ టైంలో కరోనా అంటించుకుని.. పేకాట ఆడటం వల్ల ఇంతమంది కరోనా వ్యాధిగ్రస్థులు కావడానికి కారణమైందని స్వయంగా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు. విజయవాడలోని కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని ఆయన వివరించారు.
కాలక్షేపం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచిన ఆ వ్యక్తి పేకాట ఆడాడని.. వాళ్లందరికీ అతడి నుంచి కరోనా సోకిందని.. ఆ వ్యక్తులు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు కరోనా అంటించారని.. మొత్తంగా ఈ ఛైన్లో 24 మంది కరోనా బారిన పడ్డారని కలెక్టర్ తెలిపారు. విజయవాడలోనే కార్మికనగర్లో మరో లారీ డ్రైవర్ ఇలాగే నిర్లక్ష్యం వహించడం వల్ల 15 మందికి కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఇలా 40 మంది దాకా కరోనా బారిన పడ్డారని.. ఇకనైనా జాగ్రత్త పడాలని కలెక్టర్ హెచ్చరించారు. విజయవాడలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం.. రెడ్ జోన్గా మారడంతో అక్కడ అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ఆదివారం నాడు నగరంలో చికెన్, మటన్, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్ మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
This post was last modified on April 26, 2020 1:04 am
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…