Political News

రేవంత్ టీముకు మంచి మార్కులు పడ్డాయా ?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాలు జరిగిన విధానం చూస్తే ఒకవైపు వాడివేడిగాను మరోవైపు హుందాగాను జరిగినట్లే అనుకోవాలి. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు అనగానే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. గతంలో కేసీయార్ హయాంలో కూడా ఇలాగే జరిగింది. కేసీయార్ పాలనలో పదేళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు ప్రతిపక్ష ఎంఎల్ఏలను బయటకు పంపేయటం లేదంటే సస్పెండ్ చేయటంతోనే సరిపోయింది.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల అరుపులు, కేకలతో ఒక్కరోజు కూడా సమావేశం జరిగిందిలేదు. కానీ ఇపుడు రేవంత్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్లు లేవని గుర్తించాలి. ఎందుకంటే అంశాల వారీగా జరిగిన చర్చల్లో రేవంత్, మంత్రులు, అధికార పార్టీ ఎంఎల్ఏలతో పాటు ప్రతిపక్షాలకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు కాబట్టే. బీఆర్ఎస్ తరపున కేటీయార్, హరీష్ రావు, జగదీశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, ఎంఐఎం తరపున అక్బరుద్దీన్, సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వరరెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు మాట్లాడారు.

గతంలో కూడా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చినా వెంటనే కేసీయార్ లేదా మంత్రుల జోక్యంతో ప్రతిపక్ష సభ్యులకు మైక్ కట్టయిపోయేది. పైగా కాంగ్రెస్ సభ్యులపై కేసీయార్, కేటీయార్, హరీష్ లాంటి వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడేవారు. అయితే ఇపుడు అలాంటి వాతావరణం కనబడలేదు. ప్రతిపక్షాల తరపున కేటీయార్, హరీష్, అక్బరుద్దీన్, ఏలేటి తదితరులు తాము చెప్పదలచుకున్న విషయాలను పూర్తిగా మాట్లాడారు.

నిజానికి అసెంబ్లీలో చర్చలు పార్టీల సభ్యుల ప్రాతినిధ్యం ఆధారంగానే నిర్ణయమవుతుంది. అయితే ఆ విషయాన్ని రేవంత్ పట్టించుకోకుండా బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులకు మాట్లాడే అవకాశం బాగానే ఇచ్చారనే చెప్పుకోవాలి. అందుకనే పదేపదే కేటీయార్, హరీష్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. సో, మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును గమనిస్తే రేవంత్ టీముకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

This post was last modified on December 23, 2023 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago