Political News

ఏం ఉద్ధరించాడని జగన్ కు ఓటేయాలి?: బాలకృష్ణ

యువగళం-నవశకం సభలో ఏపీ సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో సైకో పెత్తనం సాగిస్తున్నారని బాలయ్య బాబు సంచలన కామెంట్లు చేశారు. ఈ చెత్త ప్రభుత్వం చేతకాని ప్రభుత్వ ఉండటం మన ఖర్మ అని మండిపడ్డారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం..అప్పులు మాత్రం 5 లక్షల కోట్లు అని బాలకృష్ణ ఆరోపించారు.

నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. డ్రగ్స్ రాకెట్, గంజాయి పండించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. వైసిపి నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కాములు చేసి కోట్లు దోచుకుంటున్నారని బాలకృష్ణ ఆరోపించారు. 5 కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని, ప్రజలు ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురిచేసి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు.

అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలను అణచివేశారని, రైతులపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని బాలయ్య మండిపడ్డారు. అన్ని రంగాల్లో వెనకబడ్డామని, ఏపీకి పరిశ్రమలు రావడంలేదని, యువతకు ఉపాధి లేదని దుయ్యబట్టారు. హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో తాను, తన కార్యకర్తలు, అభిమానులు అభివృద్ధి చేశామని అన్నారు. చాలా చోట్ల ప్రభుత్వాసుపత్రులలో కుక్కలు, పందులు తిరుగుతున్నాయని అన్నారు.

మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని, కులాలు మతాలు కాదని…రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. జగన్ పాలన విధ్వంసం అని, తెలంగాణకు పొరపాటున ఆయనను పంపిస్తే సరిహద్దులోని కాల్చిపడేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు చూసి మోసపోవద్దని, జగన్ పాలన ఇదే విధంగా కొనసాగితే, ఆయనను గద్దించకపోతే ప్రపంచ పటంలో ఏపీ ఉండదని బాలకృష్ణ అన్నారు. జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని, ఈ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఏం ఉద్ధరించాడని జగన్ కు ఓటేయాలని బాలయ్య ప్రశ్నించారు.

This post was last modified on December 20, 2023 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…

5 hours ago

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన…

7 hours ago

సాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది!

యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…

8 hours ago

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…

8 hours ago

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో…

9 hours ago

మీ కోసం కాల్ చేసే గూగుల్.. ‘ఆస్క్ ఫర్ మీ’ AI ప్రయోగం!

రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…

9 hours ago