నిన్న విడుదలైన ఎస్ సర్వసతి సినిమా చుట్టూ కొత్త వివాదం నెలకొంది. దీనికి కథను అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా రాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ తన కథను మానభంగం చేశారని, పూర్తిగా రివెంజ్ డ్రామాగా మార్చేసి దాని ఆత్మను చంపేశారనే రీతిలో నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా రైటర్ నుంచి ఇలాంటి కామెంట్ అందులోనూ ఒక చిన్న చిత్రం మీద రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. హీరోయిన్ కం దర్శకురాలు వరలక్ష్మి శరత్ కుమార్ దానికి క్లారిటీ ఇచ్చారు.
కేవలం ఆడియో నోట్ లో వచ్చిన స్టోరీ విని నేను సరస్వతిని డెవలప్ చేసుకున్నానని, చాలా మంది సెకండాఫ్ లో విపరీతమైన ల్యాగ్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల ఇప్పటి జనరేషన్ కు కన్సెట్ అయ్యేలా మార్పులు చేసిన మాట వాస్తవమే అన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఈ స్టోరీ సాయి మాధవ్ బుర్రా దగ్గర ఉందని, నిజంగా అంత గొప్ప సబ్జెక్టు అయితే ఇన్నేళ్లు ఎందుకు తెరకెక్కలేదని ప్రశ్నించారు. అంతే కాదు పలుమార్లు పిలిచినా సిట్టింగ్స్ కు రాలేదు కనకే స్వంతంగా వర్క్ చేయాల్సి వచ్చిందని, రేప్ అనే దారుణమై పదం ఆయన వాడకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇద్దరి వెర్షన్లలో లాజిక్కులు, వాస్తవాలు ఉన్నాయి. మార్పులు ఎక్కువ చేసుకున్నప్పుడు మూల కథ కింద సాయిమాధవ్ బుర్ర పేరు వేసి, కథా విస్తరణ కింద వరలక్ష్మి పేరు ఉంటే సరిపోయేది. లేదూ ముందే సదరు రైటర్ నుంచి అగ్రిమెంట్ రాయించుకుని ఉంటే ఇప్పుడీ కాంట్రవర్సీ తలెత్తేది కాదేమో. వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పిన దాని ప్రకారం రెమ్యునరేషన్లు కూడా చెల్లించేశారట. ఆవిడ వెర్షన్లో నిజా నిజాలు ఎంతనేది సాయి మాధవ్ బుర్ర స్వయంగా వివరణ ఇస్తే తప్ప క్లారిటీ రాదు.
ఇలాంటివి జరగడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాక ఆ బాధ్యతను జ్యోతికృష్ణ తీసుకున్నారు. మణికర్ణికా టైంలోనూ ఇలాగె జరిగింది. రచనలోనే కాదు ఇతర సాంకేతిక విభాగాల్లోనూ ఇలాంటివి చూస్తుంటాం. మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పరస్పర అంగీకారంతో జరిగాయి కాబట్టి సమస్యలు తలెత్తలేదు. కానీ సరస్వతి విషయంలో జరిగింది మాత్రం పూర్తి వాస్తవాలు అవగతమయ్యాకే క్లారిటీ వస్తుంది.
This post was last modified on March 7, 2026 1:11 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…