Political News

తెలంగాణ లోక్ సభ బరిలో సోనియా, మోడీ

మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారం చేపట్టేందుకు బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల వ్యూహంతో పాటుగా ఇటీవల ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై ఈ భేటీలో చర్చ జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి విషయాలపై కూడా చర్చించారు. లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్చార్జ్ లను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాల బాధ్యతలు అప్పగించారు. నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ కు పొన్నం లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఈసారి తెలంగాణ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి స్థానం నుంచి మోడీ పోటీ చేసేందుకు మోడీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదిలో బలపడలాలని భావిస్తున్న బిజెపి తెలంగాణపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మోడీ పోటీ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో బిజెపికి బలం పెరుగుతుందని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. మినీ ఇండియాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉండే మల్కాజ్ గిరి ప్రాంతం నుంచి మోడీ పోటీ చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు.

This post was last modified on December 19, 2023 7:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

59 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

1 hour ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago