Political News

ముగిసిన యువగళం..పైలాన్ ఆవిష్కరించిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించి పాదయాత్రకు లోకేష్ ముగింపు పలికారు. 226 రోజులపాటు కొనసాగిన పాదయాత్రకు ఈ రోజుతో పుల్ స్టాప్ పడింది. జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించి డిసెంబర్ 18న ముగించారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి కారణాల నేపథ్యంలో దాదాపు నెలన్నర రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ పడింది.

ఇక, లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా అగనంపూడి జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు రావడంతో గాజువాక ప్రాంతం కిక్కిరిసిపోయింది. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి శివాజీనగర్ దగ్గర ముగించారు. లోకేష్ వెంట నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని, లోకేష్ తోడల్లుడు భరత్, ఇతర కుటుంబసభ్యులు పాదయాత్రలో నడిచారు. శివాజీనగర్ వద్ద పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని, అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని, యువతకు భరోసానిచ్చిందని చెప్పారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానని చెప్పారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి, సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని, ఆ దాడిని తాను కళ్ళారా చూశానని జగన్ ను ఉద్దేశించి లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, లోకేష్ మొత్తం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర సాగింది. వాస్తవానికి 4000 కిలోమీటర్ల మేర యువగళం సాగాల్సి ఉంది. అయితే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుతో నెలన్నర రోజులు పాదయాత్రకు బ్రేక్ పడిన నేపథ్యంలో ముందుగానే లోకేష్ తన పాదయాత్రను ముగించాల్సి వచ్చింది.

This post was last modified on December 19, 2023 7:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

35 seconds ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

1 hour ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

1 hour ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

5 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

7 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

8 hours ago