Political News

ఎస్సీ రాంసింగ్, వైఎస్ సునీతలపై కేసు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల, సీబీఐ ఎస్పీ రాంసింగ్ లపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, పులివెందుల కోర్టు ఆదేశాల ప్రకారమే ఈ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారు అంటూ వివేకా మాజీ పీఏ కృష్ణా రెడ్డి కొద్ది నెలల క్రితం పులివెందుల కోర్టును ఆశ్రయించారు.

వివేకా హత్యకు సంబంధించి కొందరు నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలంటూ కొందరు సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి చేస్తున్నారని ఆయన పులివెందుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులకు అనుగుణంగా ఉండాలంటూ సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరినా ఫలితం లేదని, ఆ క్రమంలోనే తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు…. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ముగ్గురిపై ఐపిసి సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మరి, ఈ వ్యవహారంపై వైఎస్ సునీత, సీబీఐ అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

41 minutes ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

1 hour ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

2 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

3 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

3 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

3 hours ago