Political News

ఎస్సీ రాంసింగ్, వైఎస్ సునీతలపై కేసు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల, సీబీఐ ఎస్పీ రాంసింగ్ లపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, పులివెందుల కోర్టు ఆదేశాల ప్రకారమే ఈ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారు అంటూ వివేకా మాజీ పీఏ కృష్ణా రెడ్డి కొద్ది నెలల క్రితం పులివెందుల కోర్టును ఆశ్రయించారు.

వివేకా హత్యకు సంబంధించి కొందరు నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలంటూ కొందరు సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి చేస్తున్నారని ఆయన పులివెందుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులకు అనుగుణంగా ఉండాలంటూ సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరినా ఫలితం లేదని, ఆ క్రమంలోనే తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు…. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ముగ్గురిపై ఐపిసి సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మరి, ఈ వ్యవహారంపై వైఎస్ సునీత, సీబీఐ అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

This post was last modified on December 18, 2023 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ స్టార్ కొడుకు జీతం రూ.4500

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…

22 minutes ago

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం… అజెండా ఏంటి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…

3 hours ago

వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?

తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…

4 hours ago

జ‌గ‌న్‌కు రెస్ట్‌… నాయ‌కుల‌కు టార్గెట్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి.. యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…

7 hours ago

జ‌నంలోనే కేసీఆర్‌… సమరానికి రెడీనా?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ…

8 hours ago

అంబ‌టి దీక్ష‌… మద్దతు శూన్యం!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి.. త‌ర‌చుగా కూట‌మి స‌ర్కారు స‌హా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే అంబ‌టి రాంబాబు.. తాజాగా…

12 hours ago