Political News

ఎస్సీ రాంసింగ్, వైఎస్ సునీతలపై కేసు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల, సీబీఐ ఎస్పీ రాంసింగ్ లపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, పులివెందుల కోర్టు ఆదేశాల ప్రకారమే ఈ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారు అంటూ వివేకా మాజీ పీఏ కృష్ణా రెడ్డి కొద్ది నెలల క్రితం పులివెందుల కోర్టును ఆశ్రయించారు.

వివేకా హత్యకు సంబంధించి కొందరు నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలంటూ కొందరు సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి చేస్తున్నారని ఆయన పులివెందుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులకు అనుగుణంగా ఉండాలంటూ సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరినా ఫలితం లేదని, ఆ క్రమంలోనే తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు…. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ముగ్గురిపై ఐపిసి సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మరి, ఈ వ్యవహారంపై వైఎస్ సునీత, సీబీఐ అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

This post was last modified on December 18, 2023 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

38 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago