Political News

టీడీపీ-జ‌న‌సేన కలిస్తే ఏమవుద్ది?

టీడీపీ-జ‌న‌సేన పార్టీలు చేతులు క‌లిపాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఇక‌, ఇప్పుడు టికెట్ల వ్య‌వ‌హారం మాత్ర‌మే తేలాల్సి ఉంది. అధికారంలోకి వ‌చ్చాక ప‌ద‌వుల వ్య‌వ‌హారంపై దృష్టి పెడ‌తామ‌ని జ‌న‌సేన అధినేత‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. అయితే.. అధికార‌ వైసీపీ ఒకింత ఈ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒక‌వైపు ఇరు పార్టీలు క‌ల‌వ‌కూడ‌ద‌ని అనుకున్నా.. క‌లిసి పోటీకి రెండు పార్టీలూ రెడీ అయిపోయిన ద‌రిమిలా.. వ్యూహాలు మారుస్తోంది.

ఇక‌, జ‌న‌సేన‌-టీడీపీ క‌లిస్తే.. అద్భుతాలు జ‌రుగుతాయా అని ప్ర‌శ్నించేవారికి.. మూడు ప్రాంతాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో 2019లో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి చూస్తే.. విష‌యం అర్ధ‌మ‌వుతుంద‌ని టీడీపీ, జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిస్తే.. ఇక గెలుపేన‌ని ఈ ధైర్యంతోనే ఉన్నామ‌ని అంటున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. కొన్ని నియోజ‌క వ‌ర్గాల ఫ‌లితాల‌ను ప‌రిశీలించినా.. ఇది నిజ‌మేన‌ని అనిపిస్తోంది.

  • ఉమ్మ‌డి గుంటూరులోని గుర‌జాలలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన విడివిడిగా పోటీ చేయ‌డంతో ఓట్లు చీలి పోయాయి. టీడీపీకి ఇక్క‌డ 88,591 ఓట్లు రాగా జ‌న‌సేన‌కు 12503 ఓట్లు వ‌చ్చాయి. ఈ రెండు క‌లిస్తే.. మ‌రిన్ని ఓట్లు ప‌డ‌డం ఖాయం. దీంతో ఇక్క‌డ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌ని అంటున్నారు.
  • విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేవ‌లం 25 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన టికెట్‌ను సీపీఎంకు కేటాయించారు. ఈ పార్టీ అభ్య‌ర్థి ఓట్లు చీల్చ‌డంతో ఏకంగా 29333 ఓట్లు ఆ పార్టీకి ప‌డ్డాయి. ఇక‌, టీడీపీకి 70696 ఓట్లు వ‌చ్చాయి. జ‌న‌సేన‌-టీడీపీ క‌లిస్తే.. ఈ జ‌ట్టు గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.
  • విశాఖ‌జిల్లా గాజువాక‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఓడిపోయారు. అయితే.. ఇక్క‌డ కూడా టీడీపీ ఓట్లు చీలిపోయాయి. జ‌న‌సేన‌కు 56125 ఓట్లు రాగా, టీడీపీ అభ్య‌ర్థికి 54642 ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేకి 74645 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అంటే.. టీడీపీ-జ‌న‌సేన పోటీ చేసి ఉంటే.. గెలుపును రాసిపెట్టుకునే వారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని అంచ‌నా వేసుకునే.. ఇప్పుడు జ‌న‌సేన‌-టీడీపీ వ్యూహాత్మ‌కంగా చేతులు క‌లిపాయ‌ని అంటున్నారు.
Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

7 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

36 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

1 hour ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago