Political News

తూర్పు వైసీపీలో టికెట్ మంట‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక్కొక్క‌టిగా టికెట్ల‌ను ఖ‌రారు చేస్తున్న వైసీపీలో నాయ‌కులు కూడా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందో ద‌క్క‌దోన‌నే ఆవేద‌న చాలా మంది నాయ‌కుల్లో గూడుక‌ట్టుకుంది. ఇక‌, కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ టికెట్ల వ్య‌వ‌హారాన్ని కూడా తేల్చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాకు సంబంధించి మూడు టికెట్ల‌పై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కీల‌క‌మైన‌ ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు లేవ‌ని తేల్చి చెప్పేశారు. వీరికి వచ్చే ఎన్నికల్లో సీటు తిరస్కరిస్తున్నట్లు అధిష్టానం తేల్చి చెప్పేసింది. అమరావతికి పిలిపించుకుని పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి ఈ విష‌యాన్ని తేల్చి చెప్ప‌డంతో వారంతా కంగుతిన్నారు. వీరి స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తుందీ చెప్పి మరీ సహకరించాలని కోరారు. దీంతో స‌ద‌రు స్థానాల నాయ‌కులు వెనుదిరిగారు.

అయితే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఎమ్మెల్యేలు ఫైర‌య్యారు. సీఎం జగన్‌ను నేరుగా కలిసి తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం సీటును నిరాకరించడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సమావేశం నిర్వహించారు. త‌న దారి తాను చూసుకుంటాన‌ని చంటిబాబు త‌న అనుచ‌రుల‌తో వ్యాఖ్యానించారు. మరోపక్క జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు.

ఇక‌, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు కూడా ఆవేద‌న‌లోఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతాన‌ని.. గ‌తంలోనే తాను హామీ ఇచ్చాన‌ని, కానీ, ఏ స‌ర్వేలో ఏముందో కానీ.. త‌న సీటును తీసేయడం అన్యాయ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌తిప్తాడు ఎమ్మెల్యే ప‌ర్వ‌త పూర్ణ చంద్ర‌ప్ర‌సాద్ కూడా ఆవేద‌న‌లో ఉన్నారు. అయితే, అధిష్టానం చెప్పిన‌ట్టే న‌డుచుకుంటాన‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌రుస‌గా ప్ర‌జ‌లు మార్పు కోవ‌డం గ‌మ‌నార్హం. బ‌హుశ ఈ నేప‌థ్యంలోనే వైసీపీ మ‌రోసారి మార్పులు చేసిన‌ట్టుగా భావిస్తున్నారు.

This post was last modified on December 16, 2023 11:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

4 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

48 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago