వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమనే విషయం తెలిసిపోయింది. ఇక, ఇప్పుడు తేలాల్సింది.. సీట్లు మాత్రమే. ఈ విషయం ఇప్పటికే రెండు సార్లు.. ఇరు పార్టీల అగ్రనేతల మధ్య చర్చకు వచ్చింది. కానీ, ఎటూ తేలలేదు. ఇటీవల మంగళగిరిలో కీలక నాయకులతో భేటీ అయిన.. జనసేనలో ఇదే విషయం చర్చకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలు తీసుకోవాలనేది ఈ పార్టీల నేతల వాదనగా ఉంది.
కీలక నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వంటివారు.. 40 స్థానాలకు తగ్గకుండా తీసుకోవాల నే వాదననే వినిపించారని సమాచారం. అయితే.. ఇన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా? అనేది మరో సందేశం. అయినప్పటికీ… 40 స్థానాలకు పట్టుబట్టాలనేది నాయకుల మాట. ఒకవేళ 40 స్థానాలు ఇచ్చినా.. ఎన్ని గెలుస్తాం? అనేది కూడా నాయకులు తేల్చేశారు. వీటిలో 20 స్తానాల్లో గెలుపును ఇప్పటికే రాసిపెట్టుకున్నా రనేది మరోమాట.
వీటిలో రాజమండ్రిరూరల్, కాకినాడ సిటీ/ రూరల్, నరసాపురం, అనంతపురం అర్బన్, ప్రత్తిపాడు (గుంటూరు), విశాఖ ఉత్తరం, విజయనగరం, బొబ్బిలి, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, నంద్యాల, పత్తికొండ(కేఈ కుటుంబం పాగా వేయాలని అనుకుంటున్న స్తానం), తాడేపల్లిగూడెం, ఏలూరు, కావలి, తిరుపతి, పుట్టపర్తి, చిత్తూరు, మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, దర్శి సహా పలు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.
అయితే.. ఆ సీట్లలో చాలా వరకు టీడీపీకి బలమైన కంచుకోటలుగా ఉన్నాయి. వీటిని వదులు కోవడం పార్టీకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన కోరికలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి. అయితే.. 40 సీట్లు అడిగి.. 20 స్థానాల్లో గెలుపుపై అంచనా వేసుకోవడం ద్వారా.. జనసేన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…