వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమనే విషయం తెలిసిపోయింది. ఇక, ఇప్పుడు తేలాల్సింది.. సీట్లు మాత్రమే. ఈ విషయం ఇప్పటికే రెండు సార్లు.. ఇరు పార్టీల అగ్రనేతల మధ్య చర్చకు వచ్చింది. కానీ, ఎటూ తేలలేదు. ఇటీవల మంగళగిరిలో కీలక నాయకులతో భేటీ అయిన.. జనసేనలో ఇదే విషయం చర్చకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలు తీసుకోవాలనేది ఈ పార్టీల నేతల వాదనగా ఉంది.
కీలక నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వంటివారు.. 40 స్థానాలకు తగ్గకుండా తీసుకోవాల నే వాదననే వినిపించారని సమాచారం. అయితే.. ఇన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా? అనేది మరో సందేశం. అయినప్పటికీ… 40 స్థానాలకు పట్టుబట్టాలనేది నాయకుల మాట. ఒకవేళ 40 స్థానాలు ఇచ్చినా.. ఎన్ని గెలుస్తాం? అనేది కూడా నాయకులు తేల్చేశారు. వీటిలో 20 స్తానాల్లో గెలుపును ఇప్పటికే రాసిపెట్టుకున్నా రనేది మరోమాట.
వీటిలో రాజమండ్రిరూరల్, కాకినాడ సిటీ/ రూరల్, నరసాపురం, అనంతపురం అర్బన్, ప్రత్తిపాడు (గుంటూరు), విశాఖ ఉత్తరం, విజయనగరం, బొబ్బిలి, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, నంద్యాల, పత్తికొండ(కేఈ కుటుంబం పాగా వేయాలని అనుకుంటున్న స్తానం), తాడేపల్లిగూడెం, ఏలూరు, కావలి, తిరుపతి, పుట్టపర్తి, చిత్తూరు, మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, దర్శి సహా పలు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.
అయితే.. ఆ సీట్లలో చాలా వరకు టీడీపీకి బలమైన కంచుకోటలుగా ఉన్నాయి. వీటిని వదులు కోవడం పార్టీకి కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన కోరికలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి. అయితే.. 40 సీట్లు అడిగి.. 20 స్థానాల్లో గెలుపుపై అంచనా వేసుకోవడం ద్వారా.. జనసేన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 14, 2023 12:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…