Political News

స్మితా సబర్వాల్ ఔట్..ఆమ్రపాలి ఇన్?

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు..ప్రభుత్వానికి మధ్య అవసరానికి మించి సత్సంబంధాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొందరు అధికారులు అధికార పార్టీ నేతలకు ఆకుల్లో…విపక్ష పార్టీల నేతలకు కంచాల్లో వడ్డిస్తుంటారని విమర్శలు వస్తుంటాయి. అయితే, ఆయా ప్రభుత్వాలు మారగానే…సదరు ఐఏఎస్ అధికారులు కూడా వేరే రాష్ట్రాలకు బదిలీ కావడమో, కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నించడమో జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే గతంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్మితా సబర్వాల్ కలవకపోగా…నీటి పారుదల శాఖపై సీఎం జరిపిన సమీక్షకూ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే తాను కొత్త చాలెంజ్ లకు సిద్ధమంటూ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం పనులను పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి కొనసాగుతున్నారు. అయితే, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలలో అధికారులకూ వాటా ఉందని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే స్మిత సబర్వాల్ కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు డీల్ చేసిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ సతీమణి స్మితా సబర్వాల్ అన్న సంగతి తెలిసిందే.

కాగా, స్మితా సబర్వాల్ స్థానంలో కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న మరో మహిళా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కొత్త తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఇప్పటికే ముగ్గురు సీపీలకు స్థానచలనం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ లను మార్చాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తన మార్క్ టీంను ఎంచుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.

This post was last modified on December 13, 2023 6:31 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

27 mins ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

38 mins ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

3 hours ago