Political News

జగన్ కు బాలినేని ‘బల’ ప్రదర్శన?

సీఎం జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రావు అలియాస్ వాసు వ్యవహార శైలి కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో విభేదాల నేపథ్యంలో జగన్ కు బాలినేని దూరమయ్యారని, రాబోయే ఎన్నికలలో బాలినేనికి టికెట్ దక్కకపోవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనలో ఉన్న బాలినేని ఒంగోలు వైసిపిలోనే వర్గ పోరు ఎదుర్కోవాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైవీ, బాలినేనిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా సీఎం జగన్ జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పార్టీపై, జగన్ పై బాలినేని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్న బాలినేని సొంత పార్టీలోనే కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత రాజీనామా చేయబోయేది బాలినేని అని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు 11 మంది సిట్టింగ్ల స్థానాలను జగన్ మార్చిన నేపథ్యంలో తర్వాత విడుదల కాబోయే రెండో జాబితాలో బాలినేని పేరు కూడా ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా బాలినేని ఒంగోలులో బల ప్రదర్శన చేయడం సంచలనం రేపింది.

దశాబ్దకాలంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోని బాలినేని ఈసారి వేడుకలను అట్టహాసంగా చేసుకొని తన బలం ఇది అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని బాలినేని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేస్తారని, తమ కాంబినేషన్లోనే మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామని బాలినేని తేల్చి చెప్పారు. తాను ప్రజల కోసం తపించానని, కుటుంబం కోసం ఏనాడు ఆలోచించలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమారుడికి ఏమీ చేసుకోలేకపోయాను అన్న బాధ ఉందని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. మాగుంట స్థానంలో ఒంగోలు లోక్ సభ సీటు వైవీ ఆశిస్తున్న నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తాను మంత్రిగా ఉండి డబ్బులు తీసుకున్నాను అని అర్థం వచ్చేలాగా బాలినేని ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరి, ఇటీవల బాలినేని చేస్తున్న వ్యాఖ్యలు, వైవీతో ఉన్న విభేదాలు, వర్గ పోరుల మధ్య మరోసారి ఆయనకు టికెట్ దక్కుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ బాలినేనికి జగన్ మొండి చేయి చూపిస్తే ఆయన టిడిపిలో చేరుతారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

2 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

2 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

2 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

3 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

4 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

5 hours ago