వసుంధర రాజే. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు రాజస్థాన్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆమె తనదైన ముద్ర వేశారు. అంతేకాదు.. బీజేపీని నడుం కట్టుకుని ముందుకు నడిపించిన చరిత్ర కూడా సృష్టించారు. గతంలో 2013-2018 మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనూ.. ఆమె తనదైన పాలనతో ముద్ర వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక, ఆమె శకం ముగిసింది. ప్రస్తుతం వసుంధరరాజే వయసు 70 సంవత్సరాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆమె గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు, భారతదేశ మొట్టమొదటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉన్నారు. అయితే.. తాజాగా జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఆమెను కీలకంగా ఎంచుకున్న బీజేపీ.. ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా గెలిచిన తర్వాత ఆమెను పక్కన పెట్టేశారు.
వాస్తవానికి ఎన్నికల సమయంలో రాజే సూచించిన ఏకంగా 63 మంది అభ్యర్థులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. వారంతా గెలుపు గుర్రం ఎక్కారు. అది కూడా సగం మంది భారీ మెజారిటీ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తనకు తిరుగు లేదని.. తను మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్నానని ఆమె భావించారు. కానీ, అనూహ్యంగా బీజేపీ పంథా మార్చేసింది. అసలు ఊసులో కూడాలేని భజన్లాల్ శర్మ అనే 56 ఏళ్ల తొలి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేసింది.
సంగనేర్ నియోజకవర్గం నుంచి భజన్లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. అయితే.. ఆయన పేరు సీఎం ల రేసులో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి పీఠంపై ఆశతో కేంద్ర మంత్రి గజేంద్రషెకావత్ ఇక్కడ పోటీ కూడా చేసి విజయం దక్కించుకున్నారు. అయినా.. మోడీ-అమిత్షాలు మాత్రం శర్మను ఎంపిక చేయడం గమనార్హం. ఫలితంగా రాచరికం నుంచి వచ్చిన రాజే హవాకు బ్రేకులు పడ్డాయి. మళ్లీ ఎన్నికల సమయానికి ఆమె వయసు 75 ఏళ్లు నిండుతాయి. దీంతో ఆమెకు పూర్తిగా గేట్లు మూసేసినట్టే అయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 13, 2023 10:55 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…